పుట:Kavijeevithamulu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

కవి జీవితములు



హ్మంబుం గాంచి పులకాంకితగాత్రుండై యంజలి యొనర్చి పురుషసూక్త విధానంబున నా దేవుని వినుతించి రక్షరక్ష జనార్దనయని ప్రపన్నుండై యుండ నాపరమపూరుషుం డాతనియెడఁ బ్రసన్నుండై యోయివత్సా ! నీభక్తి యుక్తులకు నలరితిని. నీజననంబు సార్థకం బయ్యె. నీవు జీవన్ముక్తుండవు. నీనామం బీజగంబున నాచంద్రార్కంబుగ నుండ భారతా మ్నాయంబుఁ దెనిఁగింపుము.

అనుడు నాతఁడు దేవరయాజ్ఞ యని తలవంచి యున్న తఱి భగవంతుఁ డదృశ్యుఁ డయ్యె. అంత నిద్రమేల్కాంచి యెంతయు సంతసంబున నక్కల నిజాప్తవర్గంబున కెఱింగించి కర్తవ్యంబు విచారించుచుండె.

తిక్కన భారత మాంధ్రీకరించుటకై యజ్ఞాము చేయుట.

అట్లుండఁ గొన్నిదినంబులకు రాజనరేంద్రుని సచివు లేతెంచి తమరాక నెఱింగించిన నగుంగాక యని యక్కవిశిఖామణి వారి వెంబడిని రాజమహేంద్రవరంబున కేతెంచె అప్పుడు రాజనరేంద్రుఁడు నాతని కెదురుగఁ జని యాలింగన మొనర్చి సభామంటపమునకుం దోడ్తెచ్చి యున్న తాసనంబునం గూర్చుండ నియమించి యర్ఘ్యపాద్యంబు లొసంగొ కర్పూరతాంబూలగంధమాల్యంబు లిచ్చి కుశలసంప్రశ్నంబు గావించి, పిమ్మట నాతనిఁ జూచి మీప్రభావంబు దివ్యంబు సుఁడీ యని స్వప్నంబుఁ దెలిపిన నాతండును నిజస్వప్న ప్రకారంబు వినిపించె. ఇట్లన్యోన్యకుశలసంప్రశ్నంబుల సంతసించి యుండ నా రాజో త్తముఁడు భారతంబుఁ దెప్పించి యం దున్నయట్టి నన్న యకృతంబుఁ జూపి కర్జం బడిగిన నాతం డిట్లనియె. నే నింతదనుక శుద్ధుఁడఁగాను. సోమరసపానంబున గాని నారసన పూతంబు గాదు. కావున నాకు జన్నం బవశ్య కర్తవ్యంబు. అనుడు వల్లె యని యా రాజు ఋత్విక్పురోహితుల నియమించి యధ్వరంబు సేయుం డనుఁడు దిక్కన యజ్వయై క్రతువు పూర్ణంబు సేసి సోమరసపానంబు సేసి యవబృథానంతరంబున భారతంబు దెనిఁగించె. తిక్కన జన్నంబు చేయుటకు వేఱుకారణంబు గల దని