పుట:Kavijeevithamulu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

కవి జీవితములు

తిక్కనసోమయాజి పద్యమునకు వర్ణము చేయుట.

అంతట రాజభటులు పత్త్రికలం గొని సర్వదేశంబులకును జని యచ్చో నున్న కవులకుఁ దమపత్రికలం జూపిన వారు స్వశక్త్యనుసారంబుగ వేర్వేఱుపద్యంబుల వ్రాసిరి. వానిం దెచ్చి భటులు రాజునకుఁ జూపిన నాతఁడు వాగనుశాసనుకుం జూపెను. ఆతఁ డేమియు నన కూర కుండె. అంతకుమున్ను కాశికాపురంబునకుం జనినభటులు కవుల వెదకుచుఁ బోవంబోవ నొక్కచో వేశ్యాగృహంబు వెడలి విడెం బుమియుచు నావులింపుచుఁ బ్రొద్దెక్కె నని త్వరతో నేతెంచుతిక్కనం గాంచి యెవ్వఁడో జారశిఖామణి యని యెంచి తమత్రోవం జన నుద్యుక్తులగుడు వారిం గాంచి తిక్కన వారి రాక నారసి పత్త్రికంగొని యందున్న వృత్తాంతంబు చూచి యందలి పద్యం బే మరల దానిక్రింద లిఖియించి యుమియుచున్న తమలంబున దానికి వర్ణం బిడి తనపేరు వారల కెఱింగించి యచ్చోటు వాసి చనియె. రాజభటు లీచిత్రంబు తమయూరు సేరి రాజునకుఁ దెల్పిన నాతఁ డచ్చెరువంది తత్పత్త్రంబుఁ గొని దాని నన్న పార్యునకుం జూపెను. దానిం జూచి యాతఁడు ఱేని కిట్లనియె. ఈతఁడే భారతంబుఁ దెనిఁగింప సమర్థుఁడు. ఈతనికవనంబును నాదియు నొక్కతీరుననే యుండును. అది యంతయు నీతఁడు నాపద్యంబ మరల వ్రాయుటంజేసి సూచించెడిని. నీకును గడు నచ్చెరు వగువన్ని యఁ దెత్తు నని యీతఁడు దీనికి వర్ణం బిచ్చెను. కావున నీతని నవశ్యంబుఁ దోడితేఁజనును. అనుడు నన్నయపల్కు లాలించి యాతనిసునిశితం బగుబుద్ధికి మిగుల సంతసించి పండితులం గాంచి యిట్లనియె. అహహా చూడుఁడు. దురవస్థం జెందియున్నను నీతని బుద్ధి యెటుల వ్యాపించుచున్న యదియో. "గూఢార్థము కవియెఱుఁగును" అన్న పండితోక్తి నిజమాయెను. అనుడు నాయార్యు లందఱును నన్న పార్యు ననేకవిధంబుల శ్లాఘించిరి. రాజును పనివిని నిజనివాసంబునకుం జని తిక్కనను రావించునుపాయంబ చింతింపుచుఁ దనమనంబున నిట్లని వితర్కించెను, "తిక్కనమన మెట్టిదో మన మెఱుంగము. అతఁడు దేశంబుగానిదేశంబున నున్నాఁడు. మన