పుట:Kavijeevithamulu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

కవి జీవితములు

మతకరి, తైష్ణు, దుష్కులు. నమానుషు, భిక్షు, ఖలాత్ము లంచు వా
క్సతిపు, శశిన్, శిబిం, గొమరుసామిని, యేరువు, నబ్ధిఁ బోల్చెదన్.

దీనిచే నన్న యకు భీమకవియెడ విశేషగౌరవ మున్నట్లు గాననయ్యెడిని. ఇట్లుండ భీమకవి కీతనియెడ భేదబుద్ధి యుండునా ? యనిమాత్రము సంశయము పుట్టుచున్నది. ఈ యిర్వురికిం గొన్ని సంవాదములై వారిగ్రంథంబులు వీరు వీరిగ్రంథంబులు వారును పూర్వపక్షము చేసినట్లున్నది. అప్పు డీశాప మీయఁబడలేదు. 'ఆరణ్యపర్వావశిష్టంబునందు భీమకవి శాపభయంబున జయంబు గొనఁగోరి 'స్ఫురదరుణాంశురాగ' యని శంభుదాసుండు నగణం బుంచి మొదటిపద్యము వ్రాసి' నని యప్పకవీయము. ఈగణమునే నళోదయమునకు ముందు కాళిదాసుండును, శివభద్రంబునందు, ప్రణమితి సిరసి యని కవివరుండును బ్రయోగించె ననియును జెప్పియుండెను వానికిఁ గారణంబు లేమియు నున్నట్టు వ్రాయలేదు. భీమనశాపభయంబున శంభుదాసుం డట్లు వ్రాసె నని చెప్పిన యప్పకవిపల్కునకు భీమనపై నతని కుండునసూయ తప్పఁ గారణంబు వేఱు గానరాదు. ఇట్టియసూయకుఁ గారణం బీతనిస్వప్నగత వృత్తాంతంబు గాని వేఱేమియు నున్న ట్లీతఁడు చెప్పలేదు. కలలోనివార్త నమ్మి మనకు దేనిని నిశ్చయించి చెప్పుటకును నలవికాదు.

నన్నయభట్టు భారతమును వదలివేయుట.

పైకథనుబట్టి యధర్వణునిచావు విని నన్నయబట్టారకుండు మూర్ఛ నొంది హితులచేఁ దెల్పంబడి కొంతవడికి లేచి యుల్లంబు దల్లడిల్ల నిట్లు చింతించెను. "హా! యెంతదుర్మార్గుండను! చూచిచూచి యొక్కక్షణంబులోపలనే బ్రహ్మహత్యం గావించితిని. నాతనువుఁ గాల్పనే ? ఎంతచదివిననేమి? బుద్ధి: కర్మానుసారిణీ యని యుండ మరలింప నేరితరంబు. ఈతఁడింతవఱకుఁ దెచ్చు నని మొదటనే యెఱింగిన నీలాటి దుర్ణయకార్యంబు సేయకుందుఁగఁదా" అని యనేకవిధంబుల డోలాయమానమానసుండై వ్యాకులపడుచుండెను. ఇదియకదా సజ్జనునకును