పుట:Kavijeevithamulu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయభట్టు.

57



చుండిరి. ఇచ్చట నాయింటివారలు ధనంబునకు లోఁబడి తమయింటికి నగ్ని సొనిపిరి. ఇట్లు గృహంబు పరశురామున కర్పణంబు సేసి రోదనంబు సేయుచు వీరలు రాజదర్శనార్థంబునకుఁ బోవునట్లు తత్సింహద్వారంబుకడ కేతెంచి యచ్చట ముచ్చటించుచున్న వారల కావృత్తాంతంబు దెలిపిరి. దాని వినినతోడనే యధర్వణుండు ఱొమ్ము మోఁది కొనుచు శీఘ్రంబ యచ్చోటు వాసి యిలు సేరి దగ్ధంబులైనతనపొత్తంబుల మొత్తంబులఁ జూచి యందు స్వకృతభారతంబు నుండుటకు మిగుల వగఁగుంది యోర్వలేమిచే నచటిపండితు లీదుస్తంత్రంబు గావించి రని యెంచి "నా కిట్టియపకృతి నొనరించినవాఁడు నాకుం బోలె సర్వైహికఫలంబులకు వెలి యయ్యెడు" మని దుర్వార క్రోధంబున శాపం బొసంగి యిఁకఁ బ్రతికియున్న నేమిఫలం బని యెంచి తా నాయగ్నిం బ్రవేశించి మసి యయ్యెను. ఇదియే నన్న యకు మతి చాంచల్య కారణము. నన్న యభట్టునకు మతిచాంచల్యకారణంబు కొందఱిచే నొంకొకవిధంబునఁ దెలుపంబడును. ఎట్లన :-

భీమకవిశాపవిషయము.

ఈతఁ డరణ్యపర్వంబు దెనిఁగించుచుండ వేములవాడభీమకవి కోపంబున నన్నయభ ట్టింకను నరణ్యంబుననే రోదనంబు చేయుచున్నాఁడా? ఇతఁ డెపుడును నట్లే యుండుగాక అని శాపం బిచ్చె ననియును, దానిచే నాతని కప్పటినుండియు మతిభ్రమణంబు గల్గె ననియును నందురు. కారణంబు లేకయే భీమన యాతనికి శాపం బిచ్చె ననుట సహేతుకంబుగ నున్నది కాదు. గ్రంథంబులు మఱికొన్నిటింబట్టిచూడ వీరలకు విరోధ మున్నట్లుగఁ గాన రాదు కాని స్నేహిత మున్నట్లు మాత్రము గానవచ్చుచున్నది. భీమనఛందము :-

చ. మతిఁ, బ్రభ, నీగిఁ, బేర్మి, సిరి, మానము పెంపున భీమునిన్ బృహ
   స్పతి, రవిఁ, గర్ణు, నర్జును, గపర్ది, సుయోధనుఁ, బోల్బఁబూన. నా