పుట:Kavijeevithamulu.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

569

4. కవికర్ణ రసాయనమును గృతినొందకుండఁ బెద్దన విఘ్నంబుచేసె నని రాయలు కోపించినఁ దత్కోపనివారణార్థంబు రాయల పే రిడి యాముక్తమాల్యదఁ బెద్దన చేసె ననువాడుకయుఁ గలదు.

5. పెద్దన యద్వైతి యై వైష్ణవమతానుసారం బగుగ్రంథంబు నెట్లు రచియింపగలఁ డని యందు రేమో. విశేషపండితుండును "అతులపురాణాగమేతిహాసకథార్థ స్మృతియుతుఁడును" వైష్ణవాచారి యగుశఠగోపయతి శిష్యుండును వైష్ణవమతస్థుండగుకృష్ణరాయల పరమహితుండును నగుపెద్దనకు నీగ్రంథంబుఁ జేయ సుకరంబు గాదె.

6. ఈప్రబంధంబు పెటుకుగా నుండుటకును నచ్చటచ్చటఁ గొన్నిస్ఖాలిత్యంబులు గల్గియుండుటకును గారణంబుఁజూడ నీగ్రంథంబు పెద్దనకృతంబు కాదనియు రాయల కృతం బనియు లోకులకుఁ దోఁచుటకై పెద్దన బుద్దిపూర్వకంబుగాఁ బన్నినయుక్తియై యుండవలె. లేదా, 3(a) పద్యప్రకారము విష్ణుచిత్తీయము మనుచరిత్రకంటె మొదట వ్రాయఁబడినయెడల ప్రథమరచిత గ్రంథంబున నొకటిరెండుతప్పు లుండుట సహజంబు.

7. ఆముక్తమాల్యదలోను మనుచరిత్రలోను వంశావళిపద్యంబులును మఱికొన్ని పద్యంబులును నొక్కటిగా నుంటకుం గారణంబు 3(a) పద్యంబు యథార్థమైనచో రాయలయెడ గౌరవముఁ జూపుటకు నాముక్తమాల్యద నుండి పెద్దన మనుచరిత్రమునకుఁ జేకొని వ్రాసి యుండవలె. లేక మనుచరిత్రము పూర్వగ్రంథమైనచోఁ గవులావంశావళి పద్యంబులు చదివినట్టుగా నాముక్తమాల్యదాకారు డాగ్రంథంబులో వానిం జేకొనియుండవలె. మనుచరిత్రములోని పద్యంబులు జగద్వివిదితంబులు. అవి పూజనీయుండగు పెద్దనార్యునిచే విరచితంబులు గావున సభ్యులాపద్యములనే చదివియుండుదురు. గ్రంథకర్త వారు చదివినట్టుగానే గ్రంథమందు వాని వ్రాసె. పెద్దన ఆముక్తమాల్యదను వ్రాసినప్పుడు తన్ను రాయలగాఁ భావించుకొని వ్రాసెనుగాని పెద్దన యనుకొని వ్రాసియుండలేదు. ఈసూక్ష్మంబు తెలిసినఁ బెక్కుసందియంబులు వీడును.

ఇంక విస్తరభీతిచే నెక్కుడు కారణంబులు వ్రాయ విరమించితిని. ఈమీఁదికారణంబులు బాగుగ గ్రహించిన నితరపక్షవాదంబు పూర్వపక్షంబుచేయ సులభంబు. ఈ యంశంబు బి. ఏ. విద్యార్థులకు నావశ్యకంబుగనుక పూర్తిగా ముద్రింపఁ గోరెద. ఆముక్తమాల్యదాకారుఁ డెవడో, విష్ణుచిత్తీయ మనుచరిత్రములలోఁ బూర్వగ్రంథ మెద్దియో యీపత్త్రికారత్నమును జదువుకవివరులు వారియభిప్రాయంబులఁ బ్రకటింపఁ బ్రార్థితులు.

ఇట్లు తమవిధేయుఁడు,

బోడపాటి. రామలింగేశ్వరప్ప

చందాదారు-సబ్‌రిజిస్ట్రారు.

శివకోడు.

గోదావరిజిల్లా.

సెప్టంబరు 27 తేది. 1886.