పుట:Kavijeevithamulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేములవాడ భీమకవి

37



ర్యగర్భములో నుండుశిశువుంగూడ సంహరింపఁ బ్రయత్నించునపుడు గల్గినది. ఈరేచర్లవారు, వేంకటగిరి, పిఠాపురము, బొబ్బిలి మొదలగు సంస్థానములవారై యున్నారు. పైని జెప్పఁబడినగోత్రమువారికి నీ సింగమనీఁడు మూలపురుషుఁడై యున్నాఁడు. అతని సంహరించుటచే నాబిరుదు గలిగినది.

54. యవనసైనికనికాయమేఘమారుతుఁడు - ఈబిరుదు తురష్క సేనలను జయించుటచేఁ గలిగినది.

55. దక్షిణదిగ్దేశాధిపతివధూలోకపాంచాలుఁడు -

56. పశ్చిమదిగ్రాజమహేశ్వరుఁడు -

57. ఉత్తరదిశానృలోకపాలకమదేభకంఠీరవుఁడు -

58. పూర్వగోత్రాధిపగోత్రవిద్వేషణుడు -

59. చోళభల్లాడధూమఘట్టనఘరట్టుఁడు -

60. దానకర్ణుండు -

61. మానదుర్యోధనుండు. -

62. పావురాయకాకోదరనీలకంఠుఁడు -

63. కంజి, చెంచీ, యెలమంచిలి, నెల్లూరు, ద్వారకాపుర, నిద్ధూమధాముఁడు. - Destroyer of conjeevaram, Jinjee, Yelamanchili, Nellore and Dwarakapura in the State of Baroda.

64. స్థలదుర్గకుంభిలాపుర నికేతనుఁడు - ఈ కుంభిలాపురమునే యిపుడు కుమిలె యని చెప్పుదురు. ఇది స్థలదుర్గముగ నుండెను.

65. పూసపాటిపురాంకుఁడు - ఈబిరుదు పూసపా డనుగ్రామంబునం గలయొకకోటను సంరక్షణ చేయుటంబట్టి పూసపాటివా రని పిలువఁబడిరి. మైలమభీమునివంశమున నమల రా జనునొకప్రభుండు పుట్టెను. అతఁడు. "గీ. పూసపా డనునగరంబుఁ బ్రోచుకతనఁ, బూసపాటిపురాంకుఁ డై పొగడు గనియె." అని యున్నది.

66. చతుర్గోత్రవందనీయుండు - ఆంధ్రదేశంబున నాలుగు గోత్రములు గలక్షత్రియు లున్నారు. ఆనాల్గుగోత్రములవారును మొదట