వేములవాడ భీమకవి
37
ర్యగర్భములో నుండుశిశువుంగూడ సంహరింపఁ బ్రయత్నించునపుడు గల్గినది. ఈరేచర్లవారు, వేంకటగిరి, పిఠాపురము, బొబ్బిలి మొదలగు సంస్థానములవారై యున్నారు. పైని జెప్పఁబడినగోత్రమువారికి నీ సింగమనీఁడు మూలపురుషుఁడై యున్నాఁడు. అతని సంహరించుటచే నాబిరుదు గలిగినది.
54. యవనసైనికనికాయమేఘమారుతుఁడు - ఈబిరుదు తురష్క సేనలను జయించుటచేఁ గలిగినది.
55. దక్షిణదిగ్దేశాధిపతివధూలోకపాంచాలుఁడు -
56. పశ్చిమదిగ్రాజమహేశ్వరుఁడు -
57. ఉత్తరదిశానృలోకపాలకమదేభకంఠీరవుఁడు -
58. పూర్వగోత్రాధిపగోత్రవిద్వేషణుడు -
59. చోళభల్లాడధూమఘట్టనఘరట్టుఁడు -
60. దానకర్ణుండు -
61. మానదుర్యోధనుండు. -
62. పావురాయకాకోదరనీలకంఠుఁడు -
63. కంజి, చెంచీ, యెలమంచిలి, నెల్లూరు, ద్వారకాపుర, నిద్ధూమధాముఁడు. - Destroyer of conjeevaram, Jinjee, Yelamanchili, Nellore and Dwarakapura in the State of Baroda.
64. స్థలదుర్గకుంభిలాపుర నికేతనుఁడు - ఈ కుంభిలాపురమునే యిపుడు కుమిలె యని చెప్పుదురు. ఇది స్థలదుర్గముగ నుండెను.
65. పూసపాటిపురాంకుఁడు - ఈబిరుదు పూసపా డనుగ్రామంబునం గలయొకకోటను సంరక్షణ చేయుటంబట్టి పూసపాటివా రని పిలువఁబడిరి. మైలమభీమునివంశమున నమల రా జనునొకప్రభుండు పుట్టెను. అతఁడు. "గీ. పూసపా డనునగరంబుఁ బ్రోచుకతనఁ, బూసపాటిపురాంకుఁ డై పొగడు గనియె." అని యున్నది.
66. చతుర్గోత్రవందనీయుండు - ఆంధ్రదేశంబున నాలుగు గోత్రములు గలక్షత్రియు లున్నారు. ఆనాల్గుగోత్రములవారును మొదట