38
కవి జీవితములు
మైలమభీమునికూటస్థు లగు ముక్కంటిరాజు, బుద్ధవర్మ, మాధవవర్మ మొదలగువారితో నీదేశములోనికిఁ దత్సహాయార్థమై వచ్చియుండిరి. అదికారణముగాఁ దమకుఁ బ్రభువులుగా నుండెడు నీమయిలమ భీముని యన్వయంబులోనివారికి నమస్కరించు నాచారము గలదు. కావున నీబిరుదు గల్గినది.
67. రాయసంస్థాననృప ప్రాణవాయుభుజ గుండు - రాయసంస్థానము కర్ణాటరాజులసంస్థానము. తత్సంస్థాననృపతుల సంహరించె నని కలదు.
68. నిజస్నానోదకకుష్ఠరుజానివారకుండు - వీరిలో నొకరు స్నానముచేసి తనబట్ట పిడిచిననీరు పోసిన నొకకుష్ఠురోగికి వెంటనే గుణమిచ్చె నని కలదు.
69. స్థలదుర్గవిజయనగరశిలాప్రాకారవిభుఁడు - అనంతర కాలములో విజయనగరము స్థలదుర్గముగాఁ జేయఁబడినది. అందు శిలాప్రాకారము గట్టింపఁబడియె. ఇదియ ప్రస్తుతము మైలమభీమునివంశస్థులకు రాజధాని.
70. జలదుర్గభీమపట్టణాధ్యక్షుఁడు - విజయనగరము సమీపమున నుండు భీమునిపట్టణము వీరికి జలదుర్గముగా నుండెను.
71. వనదుర్గమత్స్యపురవిభుఁడు - మాడుగులకు మత్స్యపుర యని నామాంతరము గలదు. ఇది వనదుర్గముగా నుండెను.
72. గిరిదుర్గముఖ్యనందాపురీప్రభుఁడు - ఈనందాపుర మిప్పటి జయపురపుసంస్థానమునకుఁ బూర్వము ముఖ్యపట్టణము. అపట్టణము వీరికి జలదుర్గముగఁ గొంతకాల ముండెను.
73. విజయభేరీప్రముఖవాద్యనవకైరవావనవరబిరుదధౌరేయుఁడు -
74. మననజమణికిరీటకనకచ్ఛత్రమత్స్యధ్వజసింహతలాటవీరకాహళాద్యనేకబిరుదాంకసముజ్వలుఁడు -
75 నీలగిరినాయకప్రతిష్ఠాపకుఁడు - అనఁగా సింహాచలస్వామిని బ్రతిష్ఠచేసె నని యర్థము.