పుట:Kavijeevithamulu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

కవి జీవితములు

48. స్థలదుర్గ కేతవరపట్టణాధీశ్వరుఁడు - కేతవరపురనాయకుఁడు అని పాఠాంతరము.

49. వనదుర్గ మొగలితుర్తిప్రభుఁడు - మొగలితుర్తిరాజధానీంద్రుం డని పాఠాంతరము. దీనింబట్టి మొగలితుఱ్ఱు పూర్వము పూసపాటివారి దనియు ననంతరకాలములో నిది కలిదిండివారి కియ్యఁబడిన దనియు నూహింపవలయును.

50. నగదుర్గానంతగిరిప్రభుండు - ఈయనంతగిరి కృష్ణరాయల కాలమునాఁటికిఁ జాలఁ బ్రసిద్ధి గల పట్టణ మయియున్నది. ఈపట్టణముం జయించి యారాజు బెల్లముకొండ, కొండవీటిసీమయును జయించి నట్లుగా నున్నది. కృష్ణరాయల కాలములో నొకమాధవవర్మ యనునాఁత డిచ్చో నధికారము చేయుచుండెను. అతఁడు మిగులఁ బ్రతాపవంతుఁడు.

51. ఏళరాయరక్కెసరాయఁడు -

52. తెల్లతలాటరాయఁడు - ఈబిరుదములన్నియును శాలివాహన సం. 1650 కాలమున మయిలమ భీమునివంశస్థులలో రాజ్యమును వహించియున్న తమ్మభూపాలునివలనఁ గృష్ణవిజయ మనునాంధ్రకావ్యములో వివరింపఁబడియున్నవి. ఈపైవానిలో నతనిబిరుదులును జేరియే యుండును. తదనంతరకాలము మొద లింగ్లీషువారు మనదేశములోఁ బ్రవేశించి మచిలీబందరు మొదలగుసముద్రతీరపట్టణములను దత్కాల ప్రభుం డగు నానందగజపతిమహారాజువలన సంపాదించువఱకును గల బిరుదంబులును, బైగ్రంథములో వదిలివేసినవియును నీక్రింద వివరించెదము.

53. రేచర్లగోత్ర సముద్భవశుష్కకాసనదాపదహనుండు - అనునీబిరుదు రేచర్లగోత్రోద్భవుం డగు త్రిభువనీరాయబిరుదుం డగుసింగమనీనికిని నా కాలములోని మాధవవర్మకును జరిగినయుద్ధములో బెజవాడసమీపంబున నున్న పెదవీ డనుస్థలము నపహరించి యతనిభా