260
కవి జీవితములు
శా. ధాటీఘోటకరత్నఘట్టనమిళద్ద్రాఘిష్ఠకళ్యాణఘం
టాటంకార విలుంఠలుంఠితమహోన్మత్తాహితక్షోణిభృ
త్కోటీడౌకితకుంభినీధరసముత్కూటాటవీఝాటక
ర్ణాటాంధ్రాధిప సాంపరాయని తెలుంగా నీకు, దీర్ఘాయు వౌ.
ఇట్టిశ్రీనాథునిపద్యములోనిశయ్యాచమత్కృతి కెంతయు నలరి తెనుంగురాయఁ డతని శ్రీనాథునిగా నెఱింగి యతఁ డేమి కోరియుండెనో దానిఁ దెల్పు మనియె. అపుడు శ్రీనాథుఁ డొకపద్యంబునఁ దనకోర్కె తెల్పె. అది యెట్లన్నను :-
ఉ. అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిక్షాదానము సేయురా సుకవిరాడ్బృందారకశ్రేణికిన్
ద్రాక్షారామపురీవిహారవరగంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్.
ఇట్లు శ్రీనాథుఁడు తనకుఁ గస్తూరి కావలయు నని యడుగఁగాఁ దెలుఁగురాయఁ డతనికిఁ గస్తూరియును విశేషము లగునితర బహుమానంబులును నిచ్చి యతని దేశమునకుం బోవ సెల వొసంగె.
తెలుఁగురాయ లెవ రని?
ఈపయిం జెప్పఁబడిన తెలుఁగురాయలు శ్రీనాథుని కాలములో మిగులఁ బ్రసిద్ధుండైనను నితనివిశేషములు తెల్పుగ్రంథసామగ్రి విశేషించి లేదు. ఇతనితండ్రి యగుసాంపరాయలంగూర్చి జైమినిభారతములో నొకసీసపద్యమున రెండుచరణము లున్నవి. అవి యెట్లన్నను :-
"సీ. దురములో దక్షిణసురతాను నెదిరించి, కొనివచ్చి సాంపరాయనికి నిచ్చె
సామ్రాజ్యమున నిల్పి సాంపరాయస్థాప, నాచార్యబిరుదవిఖ్యాతిఁ గాంచె."
అని సాళ్వమంగరాజును వర్ణింపుచుఁ బిల్లలమఱ్ఱిపిన వీరభద్రకవి వ్రాసెను. ఇంతమాత్రమునఁ జరిత్రాంశములం దెలియంజాలునాధార మది కాదయ్యెను. కావున గ్రంథాంతరములం జూడఁగోరి మడికిసింగన కవికృతపద్మపురాణో త్తరఖండముం జూడఁ దెలుంగురాయనివర్ణన ముండుటంబట్టి యతఁడును నితఁడును నొక్కఁడే కానవచ్చు నని యూహించి యాపద్యముల నిందుఁ గీల్కొల్పుచున్నాఁడను. ఆపద్యములలో న