పుట:Kavijeevithamulu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

కవి జీవితములు



గా నితనివీథినాటకములోన నీక్రిందిపద్యమువలనఁ గాన్పించును. అది యెట్లన్నను :-

"సీ. దీనారటంకాలఁ దీర్థ మాడించితి, దక్షిణాధీశుముత్యాలశాలఁ
      బల్కుతోడై తాంధ్రభాషామహాకావ్య, నైషధగ్రంథసందర్భమునకుఁ
      బగులఁ గొట్టించి తుద్భటవివాదప్రౌఢి, గౌడడిండిమభట్టుకంచుఢక్క
      చంద్రశేఖరక్రియాశక్తి రాయలయొద్దఁ, బాదుకొల్పితి సార్వభౌమబిరుద.

గీ. మెటుల మెప్పించెదో నన్ను నిఁకమీఁద, రావుసింగన్నభూపాలు ధీవిశాలు
    నిండుకొలువున నెలకొని యుండి నీవు, సరససద్గుణనికురుంబ శారదాంబ !"

ఈ పద్యమువలన నీశ్రీనాథకవి దక్షిణాధీశ్వరునియాస్థానంబునకును రాయలసంస్థానమునకును, రావుసింగ నృపాలునిసభకును బోయి యున్నట్లు గానుపించును. గౌడడిండిమ భట్టుతో సంవాదము చేసి యతని కంచుఢక్కం బగులఁ గొట్టించునట్లు కాన్పించెడిని. గౌడదేశమునకుగూడఁ బోయి యుండవచ్చును. లేదా డిండిమభట్టు శ్రీనాథుఁ డుండు సంస్థానమునకు వచ్చి యుండునపు డాతనితో వాదించి యైన నుండునోవు. ఆంధ్రదేశమునకు సమీపంబున నొకయెల్లగా నున్న గౌడదేశమునకు నోఢ్రదేశ మని పేరు. దాని యందే జగన్నాథ మనుపురుషోత్తమక్షేత్రముండుటం జేసియు నది మధ్యాంధ్రదేశస్థులకు సమీపయాత్రస్థాన మగుటం జేసియు, నీశ్రీనథునిప్రభుం డగు వేమభూపాలుని తమ్ముఁ డగువీరభద్రారెడ్డి దేశములోనిచిల్క సముద్రమున కతిసమీపంబున నుండుటంబట్టియు శ్రీనాథుడే జగన్నాథమునకుం బోయియుండె ననియును నట్టిసమయములో నచ్చోఁ బండితుఁడుగా నుండు డిండిమభట్టు పరదేశమునుండి వచ్చియున్న శ్రీనాథకవినిఁ దిరస్కరించి యుండినట్లును నూహించుటయే సయుక్తికముగా నున్నది. ఇది యాంధ్రదేశమున కుత్తరముగ నున్నది. రాయలసంస్థాన మనునది యాంధ్రదేశమునకుఁ బశ్చిమమున నున్నకర్ణాటదేశములోనియానెగొందె యనుపేర నొప్పు విజయనగర మై (Buja-nagar) యున్నది. రావుసింగభూపాలునిసంస్థానమును దేశమును నెల్లూరును నుత్తరార్కాడుజిల్లాలలోనిదై యున్నది. ఇవి యాంధ్రదేశమునకుఁ