పుట:Kavijeevithamulu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

253



రింపఁగా నాగ్రంథము నట్లుగనే నామావశిష్ట మయ్యె. కావున మన మిపుడు కమలనాభకవినివాసస్థలము నిర్ణయింపలేము. అతఁడు సరససాహిత్యచక్రవర్తి యని శ్రీనాథునిచేఁ జెప్పంబడుటచే నతఁడును తిక్కనసోమయాజి పితామహునివలెనే యొకగొప్ప యాంధ్రకవి యని మాత్ర మూహింప నై యున్నది. దీనింబట్టి శ్రీనాథునితండ్రియును శ్రీనాథుఁడును సంప్రదాయసిద్ధాంధ్రకవులని నిశ్చయింప వచ్చును. వంశపరంపరాగతము లగువిద్యల నందిన కవులతో నితరకవులు సాటిరా రని చెప్పుటకుఁ దిక్కన సోమయాజులును శ్రీనాథుఁడును సాక్షులై యున్నారు.

ఆంధ్రభాష కర్ణాటభాష యనుట.

ఈశ్రీనాథుఁడు తనకవిత్వమును గర్ణాటభాష యని వచియించెను. దానికి భీమఖండములోని పద్యము :-

గీ. ప్రౌఢిఁ బరికింప సంస్కృతభాష యండ్రు, పలుకునుడికారమున నాంధ్రభాష యండ్రు
    ఎవ్వ రేమన్న నండ్రు నా కేమికొఱఁత, నాకవిత్వంబు నిజము కర్ణాటభాష.

శ్రీనాథునికవిసార్వభౌమ బిరుదు.

ఈశ్రీనాథునకుం గవిసార్వభౌమబిరుదు గల్గినట్లుగా నొకటిరెండుస్థలంబులం గాన్పించును. అం దొకటి యితని కాశీఖండములోపలను రెండవది యితనివీథినాటకములోపలను గాన్పించును. కాశీఖండములో నితనిప్రభుం డగు వేమారెడ్డి యితనినుద్దేశించి చెప్పినపద్యము. ఎద్దియన:

"శా. ఈక్షోణి న్నినుఁ బోలుసత్కవులు లే రీమేటికాలంబులో
       ద్రాక్షారామ చళుక్యభీమవర గంథర్వాప్సరోభామినీ
       వక్షోజద్వయగంధసారఘుసృణద్వైరాజ్యభారంబు న
       ధ్యక్షించున్ గవిసార్వభౌమ భవదీయప్రౌఢసహిత్యముల్"

శ్రీనాథునివీథినాటకములోని సీసపాదము.

"చంద్రశేఖరక్రియాశక్తిరాయలయొద్థఁ, బాదుకొల్పితి సార్వభౌమబిరుదు"

శ్రీనాథునిదిగ్విజయము.

ఈశ్రీనాథకవి యనేకసంస్థానములఁ జూడ బోవుచు నచ్చటిపండితుల జయించి విశేషబహుమానముల నంది విశేషవిఖ్యాతిఁ గాంచినట్లు