పుట:Kavijeevithamulu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

కవి జీవితములు

    సంతరించితి నిండుజవ్వనంబునయందు, హర్ష నైషధకావ్య మాంధ్రభాష
    ప్రౌఢనిర్భరవయఃపరిపాకమునఁ గొనియాడితి భీమనాయకునిమహిమ

గీ. ప్రాయ మింతకు మిగులఁ గైవ్రాలకుండఁ, గాశికాఖండ మనుమహాగ్రంథ మేను
    దెనుఁగుజేసెదఁ గర్ణాటదేశకటక, పద్మవనహేళి శ్రీనాథభట్టసుకవి.

పైపద్యములు పర్యాలోచింపఁగా శ్రీనాథకృత గ్రంథములలో, 1. నిగమార్థసారసంగ్రహము, 2. మరుచ్చరిత్రము, 3. నైషధము, 4. శాలివాహనసప్తశతి, 5. పండితారాధ్యచరితము, 6. భీమఖండము, 7. కాశీఖండము అనునవి. పైగ్రంథములలోఁ దన యతిబాల్యవయస్సులో మరుత్తరాట్చరిత్రమును, యౌవనప్రాదుర్భావసమయములో శాలివాహనసప్తశతియును, నిండుయౌవనకాలములో నైషధకావ్యమును, ప్రౌఢవయఃకాలములో భీమఖండమును, వార్థకావస్థ సమీపించక యుండు సమయములోఁ గాశీఖండమును రచియించినట్లు చెప్పియుండె కాశీఖండముతరువాత గ్రంథములు రచియించినట్లు కానరాదు. పల్నాటివీరచరిత్ర మొదలగునవి యున్నట్లు కలదు. దానికి గ్రంథదృష్టాంతములు లేవు.

ఇపు డీపైగ్రంథములలో శృంగారనైషధమును, భీమఖండ, కాశీఖండములుమాత్రమే నిలిచి దేశమందు వ్యాప్తములై యున్నవి. తక్కినవి నామావశిష్టము లైనవి. శ్రీనాథునివీథినాటక మన నొప్పు గ్రంథభాగమును గొంత వ్యాపకములో నున్నది. అందలిపద్యము లప్పకవి మొదలగువారివాలన లక్షణగ్రంథములలో నుదాహరింపఁ బడుచు వచ్చెను. శ్రీనాథునికథలుగా ననేకములు పుక్కిటిపురాణములు వాడు కొనంబడినను సాధ్యమగునంతవఱకు గ్రంథస్థము లగువానిని నగర్హణీయము లగువానినిమాత్రమే యచ్చో వివరించెదను.

శ్రీనాథునియుపాసనావిషయము.

ఈశ్రీనాథుఁడు బ్రాహ్మీదత్త మగువరము కలవాఁడుగాను, ఈశ్వరార్చనాపరుండుగా నున్నట్లును, శృంగారనైషధములోఁ దత్కృతిపతి