పుట:Kavijeevithamulu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

247



యితని నుతియించిన ట్లాగ్రంథమువలనం గాన్పించును. దానింబట్టి యితఁడును, తొల్లింటి కవులంబోలె శైవమంత్రో పాసకుఁడే యని చెప్ప నొప్పి యున్నది. ఆపద్య మెట్లన్నను :-

"శా. బ్రాహ్మీదత్తవరప్రసాదుఁడ వురుప్రజ్ఞావిశేషోదయా
      జిహ్మస్వాంతుఁడ వీశ్వరార్చనకళాశీలుండ వభ్యర్హిత
      బ్రహ్మాండాదిమహాపురాణచయతాత్ప ర్యార్థనిర్థారిత
      బ్రహ్మజ్ఞానకళానిధానమవు నీభాగ్యంబు సామాన్యమే."

ఈశ్రీనాథుఁ డీశ్వరార్చనకళాశీలుఁ డని యుండుటచేతను, ఆవఱకుం గలకవులందఱును శైలో పాసకులే యయి యుండుటచేతను నంతవఱకును రామానుజమతము వ్యాపించి యుండనట్లును శంకరాచార్య మతమే ప్రబలమై యుండినట్లును నూహింపనై యున్నది. అట్టివైష్ణవ మతము నవలంబించినకవులలో నల్లసానిపెద్దన ముఖ్యుఁడుగాఁ గానుపించును. అక్కడనుండి తఱచుగ నాంధ్రకవు లందఱును వైష్ణవమతానుసారులై యున్నట్లుగా, తెనాలిరామకృష్ణుఁడును, అయ్యలరాజు రామభద్రకవియును, కవికర్ణ రసాయనకవి యగునరసింహకవి మొదలగువారలకవితలంబట్టి యూహింపనై యున్నది.

ఈశ్రీనాథకవి తనగోత్రాదికము నొకపద్యమునం దెల్పెను. దాని నీచారిత్రారంభమున ముందే చెప్పి యుంటిమి. ఇపు డాపద్యము నీక్రింద వివరించెదము. ఎట్లన్నను :-

"శా. భారద్వాజపవిత్రగోత్రుని శుభాపస్తంబసత్పూత్రు వి
      ద్యారాజీవభవుండు మారయకుఁ బుణ్యాచార భీమాంబకున్
      గారామైనతనూజు న న్ననఘు శ్రీనాథాఖ్యునిం బిల్చి స
      త్కారం బొప్పఁగ గారవించి పలికెన్ గంభీరవాక్ప్రాడిమన్."

ఇతరకవిప్రశంస.

ఈశ్రీనాథుఁడు రచియించిననైషధ, భీమఖండ, కాశీఖండము లనుగ్రంథత్రయము కావ్యత్రయముగను, శ్రీనాథుఁ డాంధ్రకాళిదాసుఁ డనియును జెప్పఁదగి యున్నది. కాళిదాసత్రయము సంస్కృతసాహితీ