పుట:Kavijeevithamulu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

కవి జీవితములు

ఉత్తరరామాయణములో నింతవఱకే తిక్కనవృత్తాంతము గాన్పించును. ఆశ్వాసాంతమునందు వ్రాయఁబడినగద్యమున నీగ్రంథరచన కాలమునాఁటికిఁ దిక్కనసోమయాజి యజ్ఞము చేయ లే దని తేలుచున్నది. ఆగద్య మెద్ది యనఁగా :-

"ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాథన విధేయ తిక్కయనామధేయ ప్రణీతం బైన యుత్తరరామాయణం బనుకావ్యంబునందు"

అని యున్నది. భారతములో "బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి" అని యున్నది. కావున నుత్తరరామాయణకాలమునకుఁ దిక్కనసోమయాజి యాహితాగ్ని కాలేదు. నిర్వచనోత్తరరామాయణములోనితుదియాశ్వాసముతప్ప తక్కిన దంతయుఁ దిక్కనసోమయాజి ప్రణీత మగుటచేత దానికిఁ గారణ మేమై యుండు నని యూహింపనై యున్నది. దాని కాగ్రంథములోని తుదియాశ్వాసమును బూర్తి చేసిన జయంతిరామకవిచే నైన కారణము చెప్పఁబడదయ్యెను. లోకప్రతీతిం బట్టి యాయాశ్వాసములో రామనిర్యాణమును జెప్పవలసి వచ్చు నని వదలినట్లుగా నూహింపనై యున్నది. అట్లే యయినచో భారతములోని స్వర్గారోహణపర్వములో మొదటఁ గృష్ణనిర్యాణంబును, అనంతరము పాండవుల లోకాంతరగమనంబును జెప్పుటయే తటస్థింపదు. అట్లు గావున దీనికిఁ గారణ మేది యైన నుండవలెను. దానిం దెల్పుగ్రంథ సామగ్రి లేదు గావున దాని న్వదలి తుదియాశ్వాసము పూర్తిచేసిన కవివరునివృత్తాంత మిచ్చోఁ గొంచెము ముచ్చటింతము :-

__________

ఉత్తరరామాయణము

8.

జయంతి రామభట్టు.

ఇదివఱకు మనము చెప్పిన జయంతి రామకవీశ్వరునిం గూర్చిన చారిత్ర మాకవిరచిత మైనయా శ్వాసప్రారంభములో గాని లోకమువా