పుట:Kavijeevithamulu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయంతిరామభట్టు.

155



డుకలోఁ గాని కానుపించదు. ఆశ్వాసాంతగద్యములోఁగూడ నొకవిధముగా నున్నది. అంతమాత్రముచేత నతనికవిత్వవిశేషములు వ్రాయఁ జాలి యుండవు. ఆగద్య మెట్లన్నను :-

"ఇది శ్రీమద్భద్రాద్రిధామ వరప్రసాద లబ్ధ కవిత గార్గేయసగోత్రపవిత్ర జయంతి కృష్ణభట్టారక సుభద్రాంబా వరతనూజ రామభట్టప్రణీతం బైనశ్రీమద్రామాయణం బనునాదికావ్యంబున నుత్తరకాండంబునందుఁ దిక్కనసోమయాజిరచిత శేషంబు గల మీఁదికథయందు శ్రీరాముఁడు కుశలవులకు విద్యాభ్యాసంబు చేయించుటయు, అతిరాత్ర, పౌండరీక, వాజపేయంబు లాదిగా శతక్రతువులు గావించుటయు........నారాయణాఖ్యం బ్రవర్తిల్లి పూర్వరీతిని వైకుంఠ పురప్రవేశంబుననుకథలు గలిగిన యేకాదశాశ్వాసము."

అని యున్నది.

దీనింబట్టి చూడ నీకవి భద్రాద్రిసమీపములోనివాఁ డనియును, గార్గేయసగోత్రుఁ డనియును జయంతి యనుగృహనామము గలరామభట్టనుబ్రాహ్మణుఁ డని స్పష్టమే. ఇతని కాలనిర్ణయము చేయుట మిక్కిలి దుర్ఘుటముగా నున్నది. ఇతఁడు గ్రంథాది నుత్తరరామాయణములోని తుదియాశ్వాసమును జెప్పుటకుఁ గలకారణ మొకపద్యములోఁ జెప్పి యుండెను. దానిం బట్టి తిక్కనసోమయాజి పదియాశ్వాసములు చెప్పి తక్కినది. చెప్పకపోవుటకుఁ గాని యట్టియసంపూర్తి గ్రంథమును దాఁ దెనిఁగించుటకుఁ గాని కారణములు తెలియఁబడవు. ఆపద్యములో నెట్లుండె ననఁగా

"తిక్కనసోమయాజి మును దెల్గున నుత్తరకాండ చెప్పి యం
 దొక్కటి జెప్పఁడయ్యె.................................
 ...............................................
 చక్కనిదేవళంబుపయి స్వర్ణఘటం బిడుపోల్కి దోఁపఁగన్."

అని తాను దెనుఁగించుగ్రంథములోని విశేషముమాత్రము చెప్పెను. కావున నింతకంటెఁ బ్రస్తుత మీగ్రంథవిషయమై వ్రాయము. కాని తిక్కనసోమయాజి చెప్పినపదియాశ్వాసములలోని శయ్యాచమత్కారమును బ్రౌఢిమమును నీపదునొకొండవయాశ్వాసములో లే దనియును నీయాశ్వాసము చదువునపుడు తిక్కనసోమయాజి యీయాశ్వా