పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దోషాధికారము.

87

క. [1]జిననుతధర్మ మహింసయ
   యనుమతమున వితతముగ గజాసురుఁ బాపం
   బని చంపఁ డయ్యె నీశ్వరుఁ
   డన నిది యాగమవిరోధ మనిరి కవీంద్రుల్. 33

క. అని యిట్టివి దశదోపము
   లనఁ జనుఁ గృతి నివియ వెండి యతిశయతరమై[2]
   చనుఁ గొన్నియెడల ధీరుల
   మన మలరఁగఁ జెప్పి రేని మల్లియ రేచా! 34

క. జయదేవాదిచ్ఛందో
   నయమున సంక్షేపరూపునం జెలువుగ మ
   ల్లియ రేచన సుకవిజనా
   శ్రయుఁ డీఛందంబుఁ జెప్పె జనులకుఁ [3]దెలియన్. 35

[4]గద్యము. ఇదివాదీంద్రచూడామణిచరణ సరసీరుహమధుకరాయమాన కవిజనాశ్రయ శ్రావకాభరణాంక [5]విరచితం బైన కవిజనాశ్రయచ్ఛందంబునందు దోషాధికారము. [6]

___________
  1. చ-లో లేదు.
  2. చ-అనునీదశవిధదోషము, లనఁ గృతులం దివియ నెండి యతిశయకరమై.
  3. క-నొనరన్.
  4. డ-లో లేదు. దీనికిఁబూర్వము చ-లో నీక్రిందిపద్య మున్నది. సకలమహీజనంబులకుసంతస మయ్యెడు సౌఖ్య సంపదల్, సకలధరాధినాథులు నిజస్థితి దప్పక భూమి నేలఁగా, సకలకవీశ్వరుల్ పొగడఁ జంద్రుఁడు సూర్యుఁడు గల్గునంతకున్ , సకలధరిత్రలో వెలసి ఛందము తద్ద వెలుంగుచుండెడున్.
  5. చ-శ్రావకాభరణ.
  6. సమస్తాధికారమని పాఠాంతరము.