పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[1]ప్రక్షిప్తపద్యములు.

క. [2]శ్రీవల్లభు యతిగణసం
   సే(వితపా)దారవిందుఁ జింతితఫలదున్
   భావజగురు నలఘుచ్ఛం
   దోవినుతు మురారి భక్తితో వినుతింతున్.

పఙ్త్కిచ్ఛందంబునందు :-
   మనోరమావృత్తము.
   నరజగంబులన్ మనోరమన్
   బరఁగు షడ్యతిం బఠింప నౌ'. 1

మణిరంగవృత్తము.
   సప్రసాదరసాగము లొందున్
   దీప్రబాణయతిన్ మణిరంగన్. 2

పంచకమలావృత్తము.
   పంచకమలాఖ్యన్ భయసల్గం
   బంచితముగా షడ్యతిఁ జెందున్. 3


  1. 25 వ పద్యము క-లో నున్నది. 14 వ పద్యము ద-లో నున్నది. తక్కినవన్నియు బ-లో నున్నవి.
  2. ఈపద్యము విష్ణుపరము గా నుండుట చేతను గొంచెము మార్పుతో ఛందోదర్పణములో నుండుటచేతను బ్రక్షిప్తము. 1 మొదలు 26 పద్యములలో యతిస్థానము చెప్పబడినది. ఈఛందస్సులక్రిందఁ బుస్తకములోని పద్యములలో యతిస్థానములు చెప్పఁబడలేదు. చెప్పకుండుటయే కవిమత మైనట్లు తోఁచుచున్నది. కావున నివి ప్రక్షిప్తములు. 27 వ పద్యములో శివసంబోధస ముండుటచేఁ బ్రక్షిప్తము. 28 వ పద్యము, అనంతునిఛందస్సులోని పద్యమునం దుత్తరార్థ మగుటచేఁ బ్రక్షిప్తము.