పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

కథలు - గాథలు

నడవకుండా ఇలాగ ఒక సంవత్సరం పాటు నోబిలీ కాలక్షేం చేసేటప్పటికి ఆయన గురించి ప్రజలకు గౌరవం కలిగింది. తరవాత ఎప్పుడైనా ఒకమాటు ఊరింబయట దూరంగా ఉన్న తన పెద్దయింటికి ఒక పల్లకీలో నెక్కిపోయేవాడు. అప్పుడు ఆయన పల్లకీముందు ప్రజలను తొలగమని కేకలు వేస్తూ దోపుదార్లు పరిగెత్తేవారు. కొన్నాళ్ల తరవాత నొబిలీ ఈ భేషజమంతా కట్టిపెట్టి సామాన్య స్వాములవారి లాగనే ఒక కాషాయాంబరం ధరించి ఒక పెద్ద పుడుగుపాటి దండం చేతపుచ్చుకొని ఇద్దరు బ్రాహ్మణ శిష్యులు వెంటరాగా కాలినడకనే బయలుదేరాడు.

మొట్ట మొదట ఇలాంటి భేషజము చూపించాలని నొబిలీ అనుకోలేదుగాని మాటలసందర్భంలో ఒక శైవ 'పండారము ' ఆయనకు ఇలాగ సలహా యిచ్చాడట: "కేవలమూ మీమట్టుకు మీరు తరించాలంటే మీ రే మారుమూల ప్రదేశానికో పోయి దిగంబరిగా వుండవచ్చును. కాని ఇతరులను తరింపజెయ్యా లని మీవుద్ద్యేశ్వమని మీరంటున్నారు. గనుక మీరు పటాటోపం కనబరిచితీరాలి. నిజమైన విరాగి పట్టు పీతాంబరాలనూ, గుడ్డపీలికలనూ, భాగ్యభోగ్యాలనూ, దారిద్య్రమునూ, మానాభిమానాలనూ, ఒక శవము వహించేటట్లుగా నిర్లిప్తతతో భరించాలి" అని అన్నాడట.

ఆ పండారము ఈ సలహా నిచ్చినది 1908 వ సంవత్సరం మధ్యలొ నట. అంతకుపూర్వము నోబిలీ యింకా పోర్చుగీసు మతాచార్యుల నల్లదుస్తులనే ధరించేవాడట. 'బడగ ' లనే తెలుగువారి కధ చాలా అసహ్యకరంగా వున్నదనిన్నీ, దీనిని తీసివేసి ఈ దేశంలో మత గురువులు, స్వాములు ధరించే దుస్తులనే మీరుకూడా ధరింవలసినదనిన్ని ఆ తమిళశైవుడు ఆయనకు గట్టిగా చెప్పాడట. మీరుమాత్రం తరించాలంటే మీయిష్టంవచ్చిన దుస్తులు వేసుకొనవచ్చునుగాని మీరు ఇతరులకు ముక్తిమార్గాన్ని బోధించ దలచుకుని శిష్యులను ఆకర్షించదలచుకుంటే మీరు సాధ్యమైనంతవరకు ఈ దేశాచారములను అవలం