పుట:Kashi-Majili-Kathalu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

కాదంబరి

చున్న యాచిన్న దాని నొక్కింతతడవు ఱెప్పవాల్పక చూచి రాజపుత్రుండు కైలాసా! అమ్మగా రెట్లాజ్ఞాపించిరొ యట్లు కావింతునని చెప్పుము. పొమ్ము. అని పలికి వానినంపెను.

అది మొదలమ్మదవతియు నిద్రించుచున్నను, మేల్కొన్నను, దిఱుగుచున్నను రాత్రిం బగలు నీడవలె రాజపుత్రుని పార్శ్వము విడువక సేవింపుచుండెను. చంద్రాపీడుండును జిత్రలేకం జూచినదిమొదలామెయందుఁ బ్రతిక్షణము వృద్ధిజెందుచున్న ప్రీతిగలవాఁడై తన హృదయముతో సమానముగజూచుచు విస్రంభకార్యములకు నియోగింపుచుండును.

అట్లు కొన్నిదినములు గడచినంత నాభూ కాంతుఁడు పుత్రకుని యౌవరాజ్య పట్టభద్రునిఁగా జేయఁదలంచి సంబారములన్నియు సమకూర్చుచుండెను. అప్పుడొకనాఁడు దర్శనార్థమై వచ్చిన చంద్రాపీడునింజూచి శుకనాసుఁడు సంతసించుచు రాజనీతి నిట్లుపదేశించెను.

రాజనీతి

తాత చంద్రాపీడ! సమస్తశాస్త్రములు నభ్యసించి వేదితవ్య మంతయు గురుతెఱింగిన నీకు మేమేమియు నుపదేశింపనవసరము లేదు. స్వభావముచేతనే వ్యాపించిన యౌవనతమము సూర్యప్రభచేతను రత్నకాంతులచేతను, దీపరుచులచేతనుఁ బోవునదికాదు. లక్ష్మీమదముసైతము దారుణమైనదే, యైశ్వర్యతిమిరాంధత్వము అంజన సాధ్యమైనదికాదు. దర్పదాహజ్వరము శిశిరోపచారముల నుపశమింపదు. విషయవిషాస్వాదనమోహము మంత్రబలంబున నశించునదికాదు. రాగమలావలేపనము స్నానంబునం బోవునదిగాదు. గర్భేశ్వరత్వము, యౌవనత్వము, అనుపమసౌందర్యత్వము, నొక్కొ