పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

    వాని సౌందర్య మక్కజమైనదగుట
    నపుడె తలఁచితి నతనిఁ బెండ్లాడ మతిని.

బడియందేమే మొండొరుల వరించుకొంటిమి. అతండిప్పుడు కాశీపురంబునఁ జదువుచున్నాడని వింటి నేనందుఁబోయి బాల్య స్నేహం బెఱింగించి యుతనిఁబతిగా వరించెద నీయైశ్వర్యము నాకక్కర లేదని పలికినది.

రతిమంజరియుఁ జిత్రసేనచెవిలో నేదియో చెప్పి యట్టివాఁడే నాభర్త యిది గురూపదిష్టము. అట్లుకావించెదనని యుపన్యసించినది. రతినూపుర వారిమాటలాలించి చిన్నవారలు మీకేమియుం దెలియదు పో. పొండు అని మందలించి యవ్వలికిఁ బోయినది.

అని యెఱింగించి మణిసిధ్ధుండు వేళయతిక్రమించుటయు నవ్వలికథ దరువాతమజిలీయందు జెప్పందొడంగెను.

145 వ మజిలీ.

చిత్రసేనా రతిమంజరులకథ.

గురుఁ డెఱిగించిన శుభదివసంబున వేకువజామునలేచి రతిమంజరి జలకమాడి ధవళమణిభూషాంబరంబులు ధరించి మాల్యను లేపనాదివాసన నలుదెసల నావరింపఁ గై సేసికొని యక్కా! నాభాగ్య మెట్లున్నదియో తెలియదు భర్తనునిరూపించు సమయమగుచున్నది. ఇప్పుడపోయి వీధితలుపుతీసినతోడనే మనయఱుగుపైఁ దొలుత నెవ్వడు గనంబడునో వానినే ప్రాణేశ్వరునిగాఁదలంచి యీపుష్పదామంబు వానిమెడలో వైచెదను. అట్లే దేశికుం డుపదేశించెను.

మఱి నందెవ్వరునులేనిచో నేమిసేయఁదగినది.అనిపలికిన చిత్రసేన చెల్లీ! మహాత్ములవచనముల కన్యధాత్వముండదు శుభోదర్కములగు వారిమాటలననుసరించిపోయిన మంగళములు సేకురకమానవు. వేళయగుచున్నది? పదపద అనిచెప్పినది. అత్యుత్సుకత్వముతో రతి