పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రతినూపురకథ.

77

    బావగారితలంపు పరికించి చుట్టాల
                   గౌరవంబుగణించి కార్యమెఱిఁగి
    ప్రాణేశుకడుపులోపలఁ బండుకొనివంశ
                  మర్యాదలులెల్ల నెమ్మదివహించి

గీ. ధర్మగతినొప్పు సాధ్వీవతంసమునకు
    నూడిగంబులు సేయరే యున్నహితులు
    నర్ధదేహ మొసంగఁడే యరసిభర్త
    వరములీయరె వచ్చి దేవతలుప్రీతి.

తల్లి — పుత్రికలారా! లోకానుభవము లేనివారగుటచే మీ రిట్లనుచున్నారు. వినుండు...

క. గాధల్ పెక్కేటి సం
   బోధింపగ నెల్లకాలము సజీవుండై
   నాథుండు బ్రదుకునే భువి
   వైధవ్యవ్యథభరింపవశమే చెపుడా

గీ. నేల బండుకొనుచు మాలికాగంధతాం
    బూలముఖ్యభోగములను వదలి
    విధవ జోగివలె వెలయంగవలెనఁట
    కామమును జయింప గలరె సతులు.

పుత్రికలు - అమ్మా! నీవు శాస్త్రజ్ఞానము లేనిదానవగుట నిట్లనుచున్నావు పూర్వకృతసుకృతదుష్కృతము లనుభవింపక యెట్టివారికిందీరదు. పెండ్లియాడినను నాడకున్నను బ్రారబ్ధమవశ్యభోక్తవ్యము. నీమతము మాకభిమతముగాదు కులవృత్తి మేమనుసరింపము. అది నిరయద్వారము. అని తిరస్కరించి పలికిరి. అందు మఱియుఁ జిత్రసేన

గీ. చదివితిని చిన్నతనమున ముదముగదుర
    దత్తకుండను మాధురాత్మజునితోడ