పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రతినూపురకథ.

69

భిక్షుకులతో నటులతో విటులతో మూలికావైద్యులతో నెన్నఁడును మాటాడునదికాదు వాండ్రు దూతకృత్యముల నిర్వర్తించి పతివ్రతల నైనఁ జెడుత్రోవల దింపఁగలరు. మఱియు భర్తకేదియిష్టమో తెలిసికొని భోజనసదుపాయము జేయుచుఁ బతివ్రతలలో నగ్రగణ్యయై యొప్పినది. స్త్రీలు సహజముగా దోషదూషితులైనను నడవడికచేఁ జక్క పడుదురు.

గోమఠుఁడు గొన్నిదినము లత్తవారింటనుండి భార్యగుణము జక్క పడినదని నిశ్చయించి మామగారికిఁజెప్పి తనకత్యంతోపకారము గావించిన గోణికాపుత్రుంజూడ ధారానగరంబునకుఁ బయనంబై పోయెను.

అనియెఱిఁగించి యాసిద్ధుండు తదనంతరావ సధంబునఁ దదనంతరోదంతం బిట్లుచెప్పందొడంగెను.

144 వ మజిలీ.

- ♦ రతినూపురకథ ♦-

పాటలీపుత్రమను నగరంబు మగధదేశమునకు రాజధానియై జగద్విదితంబై ప్రకాశించుచున్నది. ఆపట్టణంబు దత్తునకు జన్మభూమి యని యిదివఱకే చెప్పియుంటినిగదా మఱియునాపురంబున రతినూపుర యను వేశ్య కాపురము జేయుచుండెను. విద్యారూపవైభవంబుల ననవద్యయగు నగ్గణికా రత్నము కొంతకాల మేకపరిగ్రహయై కొంతకాల మనేక పరిగ్రహయై కొంతకాలమపరిగ్రహయై మిక్కిలి ధనమార్జించినది. కుబేరులవంటివిటుల జోగులఁజేసి సాగనంపినది. భూములుమిద్దెలు మేడలు చాల సంపాదించినది. సంతానముగలుగుటఁ కెడమైనది. వ్రతములు దానములు ధర్మములు సంతానాభిలాషఁ బెక్కుగావించినది. నడివయసున నొక విప్రునివలన నేవ్రత ప్రభావముననో దానికిరువురు పిల్లలుపుట్టిరి. వేశ్యల కాఁడుపిల్లపుట్టుట రాజులకుఁ బట్టభద్రుండుపుట్టి