పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

                    దులనుండి యల్లన తొంగిచూచు
    నాయివారమునకై యరుదెంచువారల
                   నూరిలో వింతలఁ గోరియడుగు
    జనకుతో మాటాడఁ జనుదెంచు యువకుల
                   కడ నొయారంబు లేర్పడ నటించు

గీ. తనదుచెంతకువచ్చు కామినుల వారి
    మగల వేపాటివనుచు సోయగములడుగు
    యౌవనోదయమందె యా పూవుఁబోఁడి
    రతులెఱుంగకమున్నె యా రాజనదన.

ఆచిహ్నంబులన్నియుఁ బరిశీలించి గోమఠుడు మామగారికిం జెప్పి వలసినంతద్రవ్యము దీసికొని భార్యను వెంటబెట్టుకొని తనదేశమునకుంబోయి యొక మహారణ్యమధ్యంబున సమున్నత ప్రాకారాంతరమున గొప్పమేడ గట్టించి భార్యతో నందుఁ బ్రవేసించి యినుపపంజరములోని చిలుకనువలెఁ గదలనీయక యాయళికుంతలకుఁ దానే విద్యాబుద్ధులు గఱపుచు నుపలాలించుచుండ నాయండజయానకు నిండుజవ్వనము పొడసూపినది. అప్పుడు.

క. తలయంటి దువ్వి జడ బూ
   వులుముడుచున్ జలువవలువ బొలుపుగఁ గట్టున్
   దిలకము దిద్దును తా న
   య్యలివేణి నలంకరించు నతఁ డెవ్వేళన్.

మఱియొకసుముహూర్తముజూచి యతండు తరుణీ! నీకుఁజెప్పెడువారలెవ్వరునులేరు. నేఁడు కేళీమందిర విలాసంబులన్నియుఁ దెలిపెదంగాక, చక్కగా గ్రహించి యనుదినమట్లు కావింపుచుండవలయు.

సీ. మొగమున మసిబూసి మొలను జింపిరిగుడ్డ
                      నెరిజుట్టుకొని తల విరియఁబోసి