పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జార కథ.

53

గోమఠా! పెండ్లియాడు సంతోషమేకాని రాబోఁవు ననర్థ మేమియుఁ దెలిసికొనకున్నావు. వినుము.

సీ. భార్య జారిణియైన బంధువుల్ నవ్వుదు
                 రెగతాళి సేయుఁదా నింటిదాసి
    యెక్క సక్కెములాడు నెదురింటివాల్గంటి
                 యక్కయు జెల్లెలు వెక్కిరింత్రు
    జనకుండు నప్రయోజకుఁడంచు నిందించుఁ
                 దల్లి వెంగలియంచుఁ దల్లడించు
    నన్నదమ్ములు వట్టి యధముఁడంచు గణింతు
                 రెఱిఁగినవారెల్ల నెత్తిపొడుతు

గీ. రహహ మఱియంతకన్న జూడ్యంబుగలదె
    కులట బెండ్లాడి యిడుమలఁ గుడుచుకంటె
    బ్రహ్మచారిగనుంటయే పరమసుఖము
    లేదు వానికి నేతంట మీఁద నింట.

ఈనిందలన్నియు సహించి కాపురము చేయుదునంటివేని,

సీ. మనసిచ్చి మగనితో మాటాడనేరదు
                  చెప్పినపని శృద్ధఁ జేయదెపుడు
    భర్తకోపింప దర్పముసూపీ మెటికలు
                  విరచు దుఃఖించి కాపురముదిట్టు
    బ్రతికూలముగనె సంభాషించు నేప్రొద్దు
                 పతిగుణంబులఁ బ్రతిహతి వచించు
    వినుతించు ధవుఁడు కాదనువారలను భర్త
                 నిందించువారి మన్నించి పలుకు

గీ. నకట! పుంశ్చలియైన యిల్లాలితోడఁ
    గాపురము సేతకంటెను గనులుమూసి