మిత్రసమ్మేళనము.
385
సాటిరారనుకొందును.
సరస్వతి — మహిమమాట జెప్పలేను కాని విద్యలకుఁ దీసి పోవరు.
రత్నపదిక — అమ్మయ్యో ! ఆమహానుభావునకు సాటి మూఁడు లోకములలో లేరని చెప్పఁగలను. మాహృద్గతాభిప్రాయములఁగూడఁ జూచినట్లు వర్ణించెను.
రుక్మిణి – అదియే యాకవిశిరోమణియందున్న విశేషము. ఎంత రహస్యమైనవిషయమైనను సమస్యగా నిచ్చినచో యథార్థము తెలియునట్లు పూర్తిచేయును.
సరస్వతి - అది దైవశక్తి, పాండిత్యప్రగల్భము కాదు.
రుక్మి -- రేవతీ ! మాయన్న యాపండితులతోఁ గలిసి కూర్చుండక మారుమూలగాఁ కూర్చుండెనేమీ ?
రేవతి - ఏమో తెలియదు. తండ్రిగారియొద్ద భయముకాదా ?
రుక్మిణి – ఆతనిప్రక్కఁ గూర్చున్నపురుషుఁడు మన మెఱిఁగియున్నవాఁడుంబోలెఁ గనంబడుచున్నాఁడు. చూడుము.
రేవతి - అగునగు నతఁడే నీహృదయచోరుఁడు.
రుక్మిణి — (జనాంతికముగా) ఈయాట ముగియులోపల నందుఁ జని వానివృత్తాంత మరసి రావలయును.
రేవతి - అట్లే పోయివచ్చెద, నదిగో గంట మ్రోగుచున్నది. మృగములతో వాఁడు ప్రవేశించునుగాఁబోలు.
మల్లిక - అడిగో అడిగో మెడలకుఁ దొడలకుఁ జేతులకు గంటలు గట్టికొని వచ్చుచున్నాఁడు. వాఁడేకాఁబోలు భైరవుఁడు. అగును. వాఁడె వాఁడె నాఁడు చూచితిని. గడ్డము జటలు పెంచుకొని యున్నాఁడు వాఁడే. ఓరీ ! క్రూరాత్ముఁడా ! నాతలిదండ్రుల నేమృగము చేసితివో చెప్పరా ! అని నిందించుచున్నది.