పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

382

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మేమియుఁ జెప్పలేదుకాని వానివలన నిడుములం గుడిచితిననిమాత్ర మెఱింగించెను. ఆభైరవుఁ డిప్పు డీయూర నున్నాఁడు. వానిమృగముల యాట రేపు సాగింతురు. వాని నప్పుడు పరిభవింపఁ దలంచికొంటిమి. వాఁడు మనచారాయణునిఁగూడ మృగమును జేసెనని యాకథయంతయు నెఱింగించెను.

అతండు భోజుండని విని ఘోటకముఖుండు విస్మయసాగరమునం దేలియాడెను. అతనిభార్య లీలావతి యిందేయున్నదని చెప్పినంతఁ గలిగినసంతోష మిట్టిదని చెప్పఁజాలను. వెండియు వార లొండొరులకథల నొండొరుల కెఱింగించికొనుచు వారు వారు పడినయిడుములు దలంచుకొని యడలుచు నాదివసము పర్వసమయముగా వెళ్లించిరి.

అని యెఱింగించి యతిపంచాననుం డవ్వలికథ మఱల నిట్లు చెప్ప మొదలుపెట్టెను.

170 వ మజిలీ.

−♦ మిత్రసమ్మేళనము. ♦−

నాఁడు భైరవుని మృగములయాటఁ జూచుటకు నియమించిన దివసము. అయ్యాటకుఁ దగిననెలవు పురమందిరము అది మిక్కిలి విశాలముగానున్నది. స్త్రీలనిమిత్తమై ప్రత్యేకముగా గదులు గట్టఁబడి యున్నవి. అయ్యాటఁజూచుటకు మల్లికయు రత్న పదిక సువర్న పదిక మొదలగు మగువలుకూడ నభిలషించి కోరుటయుఁ గుచుమారుఁ డంగీకరించి స్త్రీలనందఱను దీసికొనిపోవుటకు నేర్పాటు గావించెను.

రాజుభార్యలు రుక్మిణి మొదలగు నంతఃపురకాంతలుగూడ నావేడుకచూచుటకుఁ బోవుదురని విని చారుమతి దానుగూడ వత్తునని చిత్రసేనుం గోరికొనినది. ఆమెయందలి ప్రేమచే నతం డనుమోదించి స్త్రీవేషముతో వచ్చినచోఁ దండ్రికిఁ దెలియుసని వెఱచి చారుమతికిఁ