పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

366

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

రుండున్న సదనంబున కరిగిరి.

అందు హారకుండలకేయూరాదివిభూషణభూషితుండై దివ్యమాల్యాంబరధరుండై రత్న పర్యంకమున వసించియున్న యశ్వతరుం జూపుచు మిత్రమా ! యీతఁడే మాజనకుఁడని యెఱింగించిరి. ఆయైశ్వర్యవిశేషములన్నియుం జూచుచు రాజపుత్రుండు విస్మయసముద్రములో మునిగి విభ్రాంతి జెందుచుఁ దా నెవ్వఁడో యెందుల కందువచ్చెనో మఱచి కొంతసేపునకుఁ దెరపితెచ్చుకొని యానాగేంద్రునిపాదంబులకు సాష్టాంగనమస్కారము గావించెను.

ఆశ్వతరుం డతని గ్రుచ్చియెత్తి శిరస్సాఘ్రాణించుచు నాశీర్వదించి వత్సా! రాజపుత్ర ! నాపుత్రులు నీచారిత్ర మెఱింగింప నాలించితిని. నీసుగుణంబుల నీపరోక్షమందు వారు పొగడుచుందురు. గుణవంతుని దేవతలు పితరులు మిత్రులు అర్థులు వికలులు బంధువులు చిరకాలము జీవించునట్లు కోరుచుందురు. ఆహా! గుణవంతునిదేజన్మ. శత్రువులనైనను మిత్రులగాఁ జూచుచుందురని యతనిఁ బెద్దగాఁ బొగడి పుత్రులతో నతని కిష్టమగు సత్కారమును గావింపుఁడని నియోగించెను.

రాజపుత్రుఁడు వలదనుచుండ మనుష్యలోకదుర్లభములగు వస్తువులుదెచ్చి యతనికి విందులుగావించిరి. కువలయాశ్వుఁడు మనసున నిష్టములేకున్నను బన్నగులప్రీతికొఱకై వారిచ్చిన యాతిథ్యమును సంతోషముతో నంగీకరించెను. మఱియొకనాఁడు ఇష్టగోష్టివినోదములచేఁ గాలక్షేపము చేయుచుండ,

అశ్వతరుఁడు -- రాజపుత్రా ! నీకు నేను దండ్రివంటివాఁడ. చిరకాలమునకు మాయింటికి వచ్చితివి. మాయింటనున్న ధనకనకవస్తువాహనవిశేషములలో నేదేని గోరికొనుము నీ కర్పించుచున్నాను.

రాజపుత్రుఁడు — మహాత్మా! నేను తండ్రిచాటువాఁడను, మీరీపాతాళలోకమువలె మాతండ్రి వేయేండ్లనుండి భూమండలము పాలించు