పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

311

    దీసికొనివచ్చె నతనిఁ దద్విధము జూచి
    జనము లాహా యటంచు సం స్తవముసేయ.

అట్లు కాళిదాసకవితోఁగూడ నిజనగరబాహ్యోద్యానవనంబు సేరి యందు మహావైభవముతోఁ దమరాక వేచియున్న మంత్రిసామంతపండితపురోహితత్రభృతులఁ గాంచి ప్రహర్షాంచితస్వాంతుఁడై వారినెల్ల వేఱు వేఱ నభినందించుచుఁ బుత్రుం గౌఁగిలించుకొని సేమం బడిగి బ్రాహ్మణులకు నమస్కరించి యాశీర్వచనంబు వడసి మంత్రులతోఁ దనయభిలాషప్రకారము గావింపవలయునని యానతిచ్చెను.

కాళిదాసకవియుఁ బల్లకీదిగి కొందఱకు నమస్కరించుచుఁ గొందఱ నమస్కారంబు లంది దీవించుచు భోజుండు తనకుఁగావించిన యపూర్వసపర్యావిశేషమునుంగూర్చి పెద్దగా నుపన్యసించెఁ దదనంతరంబ.

సీ. ఒకవంక దర్శనోత్సుకతఁ బౌరులు మూఁగి
                కొనుచుఁ గోలాహలధ్వనులు సేయ
    నొకమూల మాగధప్రకరము ల్వందిబృం
               దమ్ములు విజయనాదములు నెఱప
    నొకచాయ రాగంబు లొలయఁ గానలయగా
               యనగాయనీగాననినద మమర
    నొకచక్కి సామంతసుకవిమంత్రిపురోహి
               తవిహితప్రకరమున్ తగభజింప

గీ. భద్రదంతావళేంద్రంబుపైఁ గవీంద్ర
    మండనునిఁ గాళిదాసుఁ గూర్చుండఁజేసి
    మ్రోల గాణిక్యనృత్యవిస్ఫురణగ్రాల
    సభకుఁ గొనిపోయి రూరేగి సచివు లతని.

సభాభవనద్వారంబున గజావరోహణంబు గావింపఁజేసి జయ