పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

310

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

డంగీకారము సూచించుచు మంత్రి నభినందించెను.

గోణికాపుత్రుఁడు గోనర్దీయునిఁ గుచుమారుని రాజులంటివి. వారియుదంత మెఱుఁగుదువా ? అనియడిగిన మంత్రి పేరులుమాత్రము వినియుంటిని. మరియుదంతము నాకేమియుం దెలియదని యుత్తరమిచ్చెను. రాజపుత్రునకుఁ జేయఁదగినకార్యములన్నియు నెఱింగించి ప్రధాని యరిగెను. పిమ్మటఁ జిత్రసేనుం డారాత్రియెల్ల రుక్మిణీగర్భధారణముగుఱించియుఁ జారుమతీసంబంధము గుఱించియు రాజు విని యేమనునో యనువెఱపుతో నాలోచించుచు నిద్దురబోవఁడయ్యెను.

మఱునాఁ డరుణోదయముకాకమున్న మంత్రిసామంతహితపురోహితప్రముఖులు మంగళవాద్యములతోఁ బట్టభద్రగజంబు నలంకరించి తీసికొని యూరిబయలనున్న యుద్యానవనమున కరుగుచున్నారు. దేవర విచ్చేయవలయునని యమాత్యప్రేరితుండగు పరిచరుం డెఱింగింప సంభ్రమముతో రాజపుత్రుండు దివ్యాలంకారభూషితుండై మిత్రులతోఁగూడ బయలుదేరి సామంతవర్గముం గలసికొని నగరబాహ్యోద్యానవనంబునం దదాగమనం బభిలషించుచున్నంత భేరీభాంకారధ్వనులు వినంబడినవి. అప్పుడు,

సీ. బంగారురతనాలపల్లకీ యెక్కించి
                  కాళిదాసుఁ గవీంద్రమౌళికలిత
    పాదభాసురు దండిబట్టుచు నొకచేత
                 నొకచేతఁ జామరం బొగిధరించి
    విసరుచు భోజుండు గసవు ముల్లును ఱాయి
                 మిఱ్ఱుపల్లముల రొంపియు గణింప
    కోరమితోఁ బాదచారియై యరుగుచు
                 వైదికు లిరుగడల్ స్వస్తిచెప్ప

గీ. దైవముబోనులె సద్భక్తిభావ మలరఁ
    బూజసేయుచుఁ దనగ్రామమునకు విభుఁడు