పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మని యడిగిన సువర్ణపదిక యిట్లనియె.

మీరులేనినగరములో నేనుమాత్రము వసింతునా ? సంగీతాభ్యాసవ్యసనంబునంజేసి మీతో రానంటి. రాజరాజు మనకుటుంబముపై నీసుబూని యపరాధముల విమర్శింపఁడయ్యె. వానిబానిసవాఁడు నన్ను నిర్బంధింప నిష్టపడక వానియపరాధము ఱేనికిఁ దెలియఁజేయ వినుపించుకొనలేదు. మీ రెందుండిరో యెఱుఁగను. అప్పు డొకసిద్ధుని యుపదేశంబున నొకశైలమున కరిగి శంకరు నారాధించితిని. దైవవశమున నందువచ్చిన సువర్ణ నాభుఁడను మహాపండితుం బెండ్లియాడితిని. వారితో దేశములు దిరుగుచు థారానగరంబునకు వచ్చితిమి. అందు వీరిమిత్రుఁడు దత్తకుండనువాఁడు మీశైలవృత్తాంతమంతయు నెఱింగించిన వచ్చితిమని పలుకుచు అక్కా.! వారన్న ట్లే చేసితిని. మీయక్కం జూచినతోడనే నామాట మఱచిపోవుదువని యాక్షేపించిరి. నాభర్త వాకిటఁ బుష్పవాటీవిశేషములఁ జూచుచున్నారు. వచ్చి యాతిథ్యమిమ్మని చెప్పిన సంతసించుచు నాకాంత లేచి యర్ఘ్యపాద్యాయులుగొని ద్వారముఖంబునకుఁ బోయి సువర్ణనాభు నాదరించుచు లోపలికి రమ్మని చెల్లెలిచేఁ జెప్పించినది.

సువర్ణనాభుండు మందిరాంతరమ్మున కరిగి రత్నపదిక జూప భార్యతోఁగూడ నందలివిశేషములన్నియుఁ జూచుచు విభ్రాంతినొందుచు నయ్యనస్థ స్వప్న గతంబని తలంచుచుండెను. రత్నపదిక వారిరువుర మృష్టాన్నములచే సంతృప్తులం గావించినది. ఇష్టాలాపములచే వారు నాఁటిదివసము దృటిగా వెళ్లించిరి. దివసకరుం డపరగిరిపరిసరము సేరునంత యక్షుం డాకాశమార్గంబున నొకమయూరమును జేతంబూని యాత్మీయనివాసమున కరుదెంచెను.

రత్న పదిక సువర్ణ పదికతోఁగూడ భర్తయొద్దకుఁ బోయి పాద్య మిచ్చి ముసిముసినగవులు వెలయింపుచున్న సువర్ణపదికం జూపుచు నిది