అళ్ళాణరాజుకథ.
287
మాలికొనిన నాయెకిమీఁ డేమియుఁదోఁచక యట్లుకావించెను.
అప్పు డామహేశ్వరునిమేను వెన్న బూసినట్లు చల్లఁబడినది. అమ్మయ్యా! ఇప్పటికి బ్రతికితిని. తాపము తగ్గినది. చూపులు కనంబడు చున్నవి. ఆహా ! దేవీ ! నీమహత్మ్య మగ్గింప బ్రహ్మాదులకు శక్యముకాదు. నే నీమహారాజును దుచ్ఛకార్యము గోరినందులకు శిక్షింపవచ్చితివి. బుద్దివచ్చినదని పలుకుచుఁ దత్పాద ప్రాంతభూరజంబు మఱికొంత దీసికొని శిరమునకు నొడలికి రాచుకొని సంతసముతో మహారాజా ! నే నిష్పటికిఁ బూతుండనైతిని. నా కనుజ్ఞ యిమ్ము పోయివచ్చెదను, శివపూజాధురంధరుండవగు నిన్నిట్టికోరిక కోరవచ్చునా? తలంచుకొనిననాకే తప్పుగాఁదోఁచుచున్నది. దైవమువలననే నా కట్టిసంకల్పము పుట్టినది. నీవు ధన్యుఁడవైతివి. అని స్తుతియించుచు నామహేశ్వరుం డటనిలువక రాజు నాఁటి కుండుమని బ్రతిమాలుకొనిన వినక యెందేనిం బోయెను.
రాజు సువ్రతపాతివ్రత్యప్రభావమున కచ్చెరువందుచుఁ బెద్దగా స్తుతియించి యాదరించెను.
సీ. సకలదేవమయంబు సాధ్వీలలామంబు
దేహంబు పావనతీర్థమట్లు
ప్రళయాగ్నికల్పంబు పతిదేవతా దీప్తి
దహియించు ఖలుల దుర్దాంత మగుచు
సాధుల కొదవించు సకలార్థములు పతి
వ్రత దివ్యసురభికైవడిని వడిని
శమమొప్ప నుభయవంశములఁ బూతముసేయు
సుసతీవతంస జహ్నుసుతలోలె
గీ. నమరు ప్రతికృతి పిడుగునకైన వజ్ర
మునకునైనను గాకోలమునకునైన