అష్టాపథసత్రము కథ.
259
చేసియున్న దే.
తార్కి - అక్కడనే సందిగ్ధముగానున్న ది బ్రాహ్మణుని బెండ్లియాడుటకిష్టములేకకాఁబోలు నేవియో ప్రతికూలములు సెప్పియాటంకము గలుగఁజేయుచున్నది.
కవి - మీ రందుఁబోయితీరా ?
తార్కి - గొప్పవివాహము జరగును సంభావన దొరకునని పోయితిని. ఏదియు లేకపోయినది.
ఆసంవాదము విని బ్రహ్మదత్తుఁడు ముందరికివచ్చి కవీశ్వరునితో నార్యా! మీరు ధారానగరమునుండి వచ్చుచున్నామని చెప్పితిరి. అందుఁ జారాయణుఁడను పండితుండు గనంబడలేదుగద. అతని మిత్రులు దత్తకాదులు మహావిద్వాంసు లార్వురుండవలె. వారివాడుక పురమంతయు వ్యాపించియే యుండును. వింటిరా? అని అడిగిన నేను మూఁడుదినములు మాత్రమే యందుంటిని. వారిపేరు వినలేదని చెప్పెను.
అప్పుడు వేఱొకప్రక్కం గూర్చున్న యొకబ్రాహ్మనికుమారుఁ డాప్రాంతమునకువచ్చి బ్రహ్మదత్తునిమొగము పరీక్షించిచూచి మీరెవ్వరు? చారాయణుని దత్తకాదుల నడుగుచున్నారు. వారి నెఱుఁగుదురా యేమి ? అని యడిగిన బ్రహ్మదత్తు డిట్లనియె.
అయ్యా ! చారాయణుఁడు మార్గవశంబున మాయింటి కతిధిగా రాఁగా నతనికి నాకూఁతురు మల్లిక నిచ్చివివాహము గావించితిని. దత్తకాదులు తనమిత్రులనియు. ధారాపురంబునఁ దననిమిత్తము వేచి యుందురనియు వారింగలిసికొని వేగముగా వత్తుననిచెప్పి యరిగెను. చెప్పినమితి దాటినది. అతనిజాడ యేమియుం దెలియలేదు. అతని వెదకుచుఁ గుటుంబముతో బయలుదేరితినని తనవృత్తాంత మంతయుఁ జెప్పెను.
ఆకథవిని యావిప్రకుమారుండు సంతసించుచు నో హెూ! మీ