పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిద్ధునికథ.

243

    గరిపోతములు గరాగ్రమున నీరుగ్రహించి
                   కలయంపి వాకిటఁ గలయఁజల్లెఁ
    గటిచయం బలికె వాకిలి వేదికల వల
                   పులపచ్చకస్తురి బురదఁ దెచ్చి
    కరికుంభసక్తముక్తాఫలంబుల నేరి
                   కలయ సింగములు మ్రుగ్గులుఘటించె

గీ. గీతములు బాడె శారికాకీరచయము
    నెమళు లొప్పుగ నాడెఁ బింఛములు విప్పి
    యరుణుఁ డదయింపకయమున్న యటకు వచ్చి
    శాంతమతి సిద్ధు సత్తపశ్చర్యమహిమ.

మఱికొన్నిమృగంబులు భక్తివిశ్వాసములతోఁ గందమూలఫల కుసుమదళాదులం దీసికొనివచ్చి యప్పర్ణశాలయందు జపముసేసికొనుచున్న సిద్ధునిపాదమూలంబున నిడి తత్ప్రసాద మాకాంక్షించుచు మోడ్పు చేతులతో నాప్రాంతమున వసించినవి.

ఆమృగచేష్టలన్నియుం బరికించి భైరవుండు గుండెచెదర నందున్నసిద్ధుండు దనకుఁ గనఁబడమి నయ్యో ! మృగోపద్రవంబు నన్ను విడువదుకాఁబోలు. నాఁ డెట్లో బయలుపడితిని. నేఁ డిందు నాకుఁ జావు మూడినది. తప్పదు. కానిమ్ము. మృగంబు లిందన్యోన్య వైరంబులు విడిచి మైత్రితో మెలగుచున్నవి.

ఇదియేమిమహిమయో తెలియదు. ఏనుఁగకు సింహంబు గలలోఁ గనంబడినంతనే చచ్చునని చెప్పుదురు. ఆరెండుమృగము లెట్లు చెలగాట లాడుచున్నవో! అయ్యారే! కండూతివాయం బులి గంగడోలు నాకుచుండ ధేనువు మెడసాచి చూచుచున్నది. ఇంతకన్నఁ జిత్రమేమి? యనితలంచుచు నాతరుశాఖాంతరముల నణఁగి యొంటిప్రాణముతోఁ జూచుచుండెను.

మఱియు నంబరమణి గగనమధ్యంబలంకరింప మఱల నాఘంటా