పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజుని కథ.

13

కళ్ళెములాగి మడమలతో నించుకగొట్టి యదలించినంతనాగంధర్వంబు ఱెక్కలుగలదివోలె నతిజవంబునం బరుగిడుచు నాస్కందిత ధోరతికాది గతివిశేషములంజూపుచు వచ్చినదారిం బోవుచుండెను. దత్తుండు కళ్ళెము బిగలాగి యాహయరయం బుడుపవలయునని యెంత ప్రయత్నించినను నదియాగినదికాదు. మహావేగముగాఁ బోయిపోయి రెండు గడియలలో భోజరాజ రాజధానియగు ధారానగరము సమీపోద్యానవనంబు జేరినది. అని యెఱిగించి, వేళ యతిక్రమించుటయు మణిసిద్దుం నవ్వలికథ దరువాతి మజిలీయం దిట్లు చెప్పఁ దొడంగెను.


143వ మజిలీ.

భోజుని కథ.

భోజరాజునకు నలువురు భార్యలని వెనుక తచ్చరిత్రంబునఁజెప్పి యుంటినికదా. వారినల్వురయందు సమాన ప్రతిపత్తిగలవాఁడై నను లీలావతిచేయు నుపచారములంబట్టియుఁ దొలుత నడవులఁ బెక్కిడుమలంబడి తన్నొడయనిగాఁ బడసినదగుటయు నామెయంతఃపురమునఁ దఱుచుగా వసించుచుండును. ఆసాథ్వీరత్న మత్యంత భక్తివిశ్వాసములతో భర్తనారాధించుచుండెను. భార్యలకంటెఁ బుత్రులకంటెఁ గాళిదాసకవియం దాభూభర్త కధికప్రీతి కలిగి యున్నది. ఆకవి శిఖామణింజూడ నొక యామ మెడమైనచో యుగాంతరములైనట్లు చింతించుచుండును. సభయందేకాక యాహారవిహార శయనాసనముల యందుఁగూడ నతండాపండితునివిడిచి యుండనేరఁడు. తాను లీలావతి యంతఃపురమునకుఁ గూడ కాళిదాసుందీసికొనిబోవుచుండును. అయ్యంబుజాక్షియు బ్రత్యక్షముగా నాకవితో సంభాషింపదు గాని భతన్‌సమక్షమున బెనిమిటితోఁగూడ సమయోచితములైన యుపచారములఁ గావించుచుండును. విసరుమనియు మడుపులందిమ్మనియు శయ్యఁగల్పిం