మదయంతికథ.
227
నేను - కాశీనగరము.
రాజు - బ్రాహ్మణులా?
నేను - అవును,
రాజు - ఏమిచదివికొంటిరి?
నేను - నాలుగువేదములు నాఱుశాస్త్రములు నఱువదినాల్గు విద్యలుం జదివికొంటిని.
రాజు — (విస్మయమభినయించుచు) మీ రాకోటముంగలి ప్రకటనపత్రికం జదివికొంటిరా?
నేను - చదివికొనియే యిక్కడికి వచ్చితిని.
రాజు — ఇదివఱ కిట్టిభూతము నెందైన వదలించితిరా ?
నేను – లేదు. ఇదియే మొదటిప్రయత్నము.
రాజు - (పెదవివిఱచుచు) ఈభూతము విద్యలకు సాధ్యముకాదు.
నేను - ఆమాట నే నెఱుంగుదును.
రాజు — మీకు భూతవైద్యమునందుఁ బ్రవీణత గలదా ?
నేను - లేకున్న నిం దేలవత్తును ?
రాజు - మీరు చిన్నవారలు, తెలియక వచ్చితిరనినే నభిప్రాయము పడుచుంటిని.
నేను - అట్టియభిప్రాయము పడనవసరము లేదు.
రాజు — మీప్రాణహానికి నేను బూటకాపును కానుచుఁడీ బాగుగా నాలోచించుకొని దిగుఁడు. ఊరక కాలసర్పమునోటఁ జేయినిడకుఁడు.
నేను - వెఱుపులేదు. ఆలోచించుకొనియే వచ్చితిని.
రాజు - ఎన్ని దినములకుఁ గుదురుతురు ? ఏతంత్ర ముపయోగింతురు?
నేను - ఎన్నోదినములా? అయిదునిమిషములు; తప్పిన రెండు గడియలు.