పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

సామర్థ్యము గలిగినది. నీ కుపకారముసేసితినేని పాపవిముక్తుండ నగుదునని తలంచుచుంటినని నా చెవులో నేదియో రహస్యము చెప్పి యీరూపముగా నీకురాజ్య వైభవముగలుగునట్లు చేసెదనని యుపాయముచెప్పెను.

రాజ్యముమాట పిమ్మటఁ జూచికొనవచ్చును, నేఁటికి బ్రతికితిని గదా? అని సంతసించుచు నాబ్రహ్మరాక్షసు ననేకస్తోత్రములు చేసితిని. అంతలోఁ దెల్లవాఱుసమయమైనది. అప్పు డాబ్రహ్మరాక్షసుఁ డారావిచెట్టుకొమ్మలు గలగలలాడఁ జప్పుడుసేయుచు నెగిరి యెక్కడికో పోయెను. నేనును బ్రతుకుజీవుఁడా ! అని యటఁగదలి దక్షిణాభిముఖముగాఁ బోయిపోయి కొన్ని దినము లాయడవి గడచితిని. అని యెఱింగించి యవ్వలికథ తరువాతిమజిలీయందుఁ జెప్పుచుండెను.

159 వ మజిలీ.

−♦ మదయంతికథ. ♦−

శ్లో॥ నాకాలె మ్రియతె జంతు ర్విద్ధశ్శరశ తైరపి
     కుశాగ్రేణైవ సంస్పృష్టః ప్రాప్త కాలోనజీవతి.॥

నూఱుబాణములచేఁ గొట్టినను కాలముమూడనివాఁడు చావఁడు, కాలమువచ్చినవాడు దర్భగ్రుచ్చికొనినను చచ్చును

అనునట్లు అయ్యడవినుండియు బ్రహ్మరాక్షసునినోటినుండియు నాయు శ్శేష ముండఁబట్టి యీవలఁ బడితిని,

శ్లో॥ ధనాశా జీవితాశాచ గుర్వీ ప్రాణ భృతాంసదా॥

ప్రాణధారులకు జీవితాశయు, ధనాశయు, నన్నిటిలో గొప్పవి కదా? నేనంతటితోవిడువక బ్రహ్మరాక్షసుం డెఱింగించినవిషయంబు పరిశీలించుటకై కొన్నిదినము లాప్రాంతదేశములు దిరిగితిని. నీవలెనే నేనును నొకనాఁ డొకయగ్రహారములో నొకవిప్రునింటి కతిథినై భుజించుచున్న