పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరస్వతి కథ.

183

 
    ఇటుల వాక్రుచ్చి యెంతెంతలేసివార
    లిటఁ బరాజితు లైరొ నీ వెఱుఁగ వకట !

సీ. నేపాళ దేశావనీపాలనందను
                  బహుకళాన్వితు సిగ్గుపఱచి పంపె
    సకలశాస్త్రజ్ఞు దర్పకతుల్యు మగధభూ
                  పతిపుత్రుఁ దృటిఁ బరాజితు నొనర్చె
    సంగీతశాస్త్ర ప్రసంగదక్షుని బాండ్య
                 జననాథసుతుఁ బదార్చకునిఁ జేసె
    నఱువదినాల్గువిద్యల నెఱింగినప్రోడ
                 గౌడభూపాత్మజు నోడఁబుచ్చె

గీ. మఱియు నెందఱినో కళామహితులైన
    నృపకుమారుల మారసన్నిభులఁ బెదవి
    గడపకుండఁగఁ జేసె వాక్కలనఁ గలన
    సలిపి సామాన్యయే సరస్వతి కుమార !

నీ కీవెఱ్ఱి యేలపుట్టినది? మఱియొకచోటంగూడఁ బరపతిలేకుండఁ జేసికొనుచున్నావు.. వైదికుఁడా ! రాజ్యకాంక్షంజేసి యాసపడివచ్చితివి. ఇది గేలపుసిరికాని గంపసిరికాదు. నీయభిలాష సరియైనది కాదు. వచ్చినదారిం బొమ్ము. మఱియొక దేశాధిపతికడ నీపాండిత్యప్రకర్షము చూపుమని హేళనముగాఁ బలికిన నగుచుఁ గుచుమారుం డిట్లనియె.

అయ్యా ! నేను మీరాజపుత్రికచారిత్రము తెలియక వచ్చినవాఁడనుగాను. ఈప్రపంచకములో నామెను మించినపండితుఁడు లేడనియా మీయాశయము. తాడితన్నువాని తలదన్నువాఁడు మఱియొకఁ డుండునని తెలిసికొనుఁడు.

ఆహా ! బహుసంవత్సరములు గురుకులవాసముసేసి కాశీపురంబున విద్యాభ్యాసంబుగావించి మహాపండితులమని పేరుపొంది దిగ్విజయ