176
కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.
చేతికి దొరకినది
సంతోషముతో నా పుస్తకమునువిప్పి యందుండియే చదివెను. దేవనాగరలిపి పురాతనమైయున్నది. స్పష్టముగా నక్షరములు తెలియమింజేసి చెట్టుదిగి పసరువ్రాసి చూచెను. చదువుటకు వీలుగానుండెను. అందనేకవిషయములు వ్రాయఁబడియున్నవి. అందు ముందుగా సిద్ధుని స్వీయచరిత్రము అనుశీర్షికచూచి యిట్లుచదివెను.
−♦ సిద్ధుని స్వీయచరిత్రము. ♦−
గోదావరీతీరమునఁ బర్ణశాలయను నగ్రహారము గలదు. అందు శ్రీధరభట్టను బ్రాహ్మణుఁడు గలఁడు. అతనికిం బ్రాయముమీఱిన తరువాత మహిధరభట్టను కుమారుఁ డుదయించెను. తండ్రి పుత్రు నుచితకాలమునఁ జదువవేసెను. ఆబాలుం డెనిమిదేఁడుల ప్రాయము వాఁడై బడిలో నుపాధ్యాయుల యొద్ద నామలింగానుశాసనమను నిఘంటువును జదువుచు నందు,
శ్లో॥ అణిమా మహిమాచైవ గరిమా లఘిమాతథా
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వంచేతి సిద్ధయః ॥
అనుశ్లోకమును జదివి దాని కర్ణమేమని గురువుగారి నడిగెను. అతండవి యష్టసిద్ధులు తపస్సాధ్యములు మహాయోగులకుఁగాని పొంద శక్యములుగావు. వానియర్థబోధావసరము నీకిప్పుడు లేదు. అని యొజ్జలు సెప్పుటయు మహిధరభట్టునకు వానివిశేషములెట్టివో తెలిసికొన వలయునని యభిలాషగలిగినది. పలుమారాశ్లోకమునే చదువుచుండును. మఱికొంతకాలమునకే వానితలిదండ్రులు పరమపదించిరి. పిమ్మట మహీధరభట్టు గ్రామమునువదలి దేశములు తిరుగుచు నొకనాఁడొక పండితు నాశ్రయించి మున్ను తానువర్లించిన శ్లోకమునుజదివి దాని యర్థమును వివరముగాఁ జెప్పుమని వినయముగాఁ బ్రార్థించెను.
ఆపండితుఁ డాతనింజూచి నవ్వుచు నీకీసిద్ధు సంపాదింపవలయునని