పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

    యందు నరనాథనందనుం డబ్బుచుండ
    నొడఁబడమి కేను సన్యాసినో మహేశ !

అని యంగీకారము సూచించుటయు నారాజనందనుం డమందానందకందళితహృదయారవిందుండై యయ్యిందువదన నక్కునఁ జేర్చి చెక్కులు ముద్దుపెట్టుకొనుచు మేనం బులకాంకురములు బొడమ బండి యెక్కించి యంతఃపురమునకుఁ దీసికొనిపోయెను.

అని యెఱింగించి.

151 వ మజిలీ.

-♦ కుచుమారునికథ. ♦--

కుచుమారుండు దత్తకాదిపండితు లేడ్వురలో నొకఁడు. దత్తునికంటె రెండేండ్లు చిన్నవాఁడు. మిక్కిలి చక్కనివాఁడు. విద్యలలో దత్తునితో సమానుఁడు. అతనికి మహారణ్యసంచారము గావించి యోషధీ విశేషముల సంగ్రహింపవలయునని చిన్నతనమునుండియు నభిలాష గలిగియున్నది. ఈమిత్రులలో నొకఁడగు సుపర్ణ నాభునికి నట్టియభిలాషయే కలదు. వారిరువురు శుభముహూర్తంబునఁ గాశీపురంబు బయలువెడలి యుత్తరదేశారణ్యమార్గంబులంబడి పోయిరి.

కుచుమారుండు మారుఁడువోలె సుకుమారుం డగుట దుస్తర ప్రస్తర హిమానీ కంటక దుర్గమంబగు కాంతారమాగన్ంబున నడువ నోపక యొకనాఁడు నేలం జదికిలంబడి వయస్యా ! నీ బలవంతమున నింతదూరము వచ్చితిని. మంచుగాక మన కేవిశేషము గనంబడలేదు. ఇఁక మనము మఱలి పురవిశేషంబులం జూచుచు నియమితకాలమునకు ధారానగరంబునకుఁ బోయి మిత్రులం గలిసికొందము. ఇక నే నడుగు నడువజాలను. ముందుఁజూడ మహారణ్యభీకరములై హిమచ్ఛన్నములగు పర్వతశిఖరములు గనంబడుచున్నవి. పోవఁజూలమని పలికిన విని సువర్ణ