మాతంగుని కథ.
131
యని యడిగిన నేమియుమాటాడక శిరఃకంపమునఁ నంగీకారము సూచించెను.
నీవేమి చదివికొంటివి? యుపాధ్యాయుఁ డెవ్వడు? అనియడిగిన నాబాలుఁడేమియు మాటాడక యూరకుండెను. ఏమియుఁజదువుకో లేదని వానితండ్రి సమాధానము సెప్పెను.
రాజు - మాతంగా ! నీకుఁ బిల్లలెందఱు?
మాత - దేవా ! వీఁడొక్కడే. సింతామణికృపచేఁ గలిగెను
రాజు - చింతామణి యెవ్వతె?
మాత - బోగమామిడ. మా తెలిసినది బాబూ!
రాజు - ఏమి సెప్పినది ?
మా - ఎవ్వడో రుసి గంగలో సెపము చేసికొనుచుండగా మండువేసవిని పాదరచ్చలు దారిలోనుంచమని చెప్పినది. అట్టుసేసితిని వీఁడుగడుపునఁబడియెను.
రాజు - వీఁడు మాంసము తినునా ?
మా - దేవా! మాంసముగాదు అన్నమునుతినఁడు పాలు ద్రాగడు సింతామణిగారే పాలు పండులు తెచ్చి పెట్టుచుండును. తండ్రి! ఇంతే సత్తెము.
ఆమాటలువిని యారాజు మిక్కిలి విచారించుచు నప్పుడపసిండి పళ్లెరమున వేయుదీనారములు బోసికొని యాబాలునకుఁ గానుకగా నర్పించుచు బాలకా ! వీనినీకుఁ బారితోషికముగా నిచ్చితిని నీవురాత్రి గస్తుతిరిగినందులకు గైకొనుమనిపలికి యర్పించుటయు నామాణవకుఁడు ఆపళ్లెరము రెండుచేతులతో గ్రహించి అమ్మా! వీనినేను మోయఁజాలను గైకొనుమని పలుకుచు వారికందిచ్చెను.
చండాలదంపతులు పరమానందభరిత హృదయులై యాపళ్లెరమందుకొని మొహిరీల మూటగట్టుకొనిరి రాజు వారికింటికి బోవుటకు