పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతంగుని కథ.

127

తల్లి దండ్రులు అన్నఁదమ్ములు భార్యాపుత్రాదులు ధనగృహ పశ్వాదులన్నియు నస్థిరములు క్షణభంగురములు వానినమ్మియుండక నిత్యమగువస్తువుం దెలిసికొనుటకై మేలికొనియుండుడో ! అనిమరల కేకపెట్టెను.

పుత్రా ! క్రొత్తమాటలాడుచున్నావు. రాజుగారివలన మాట వచ్చుఁజుమీ! ఇఁక నీవారీతి పలుకవలదని మందలించిన దల్లికిఁ బుత్రుఁ డివి ప్రాతమాటలేయని సమాధానము చెప్పెను.

మూఁడవజామున మాతంగిని గుమారుఁ బడమరవీధికిఁ దీసికొనిపోయినది. అందతండిట్లు కేక పెట్టెను.

శ్లో॥ జన్మదుఃఖం జరా దుఃఖం జాయాదుఃఖం పునఃపునః
      సంసార సాగరందుఃఖం తస్మాజ్జాగృధజాగృధ

జాయా పుత్రాది సంగభంగురంబై జన్మ జరామరణ వ్యాకులంబై యొప్పు సంసారసాగరము దుఃఖప్రదమైనది. దీనిందాటు తెరు వరయుచు మేలికొనియుండుఁడో యని కేకపెట్టెను.

నాలుగవజామున నుత్తరపువీధికింబోయి యందు.

శ్లో॥ ఆశయా బద్ధ్యతెలోకో కర్మణా బహుచింతయా।
     ఆయుక్షీణం నజానాతి తస్మాజ్జాగృధ జాగృధ॥

లోకమున తనకాయువు దినదినముక్షీణించుచున్నదని తెలిసికొన లేక పెద్దయాసచేఁ గట్టఁబడి గొప్పగొప్ప పనులుచేయుటకుఁ బ్రయత్నించుచుండును మృత్యుదేవత యెప్పుడోవచ్చి గుటుక్కున మ్రింగి వైచును కావున నావిషయమై యప్రమత్తులై మేలికొనియుండుఁడో యని కేకపెట్టెను. తల్లియునట్లుచెప్పినందుల కేమిమూడునోయని వెఱచుచుఁ గుమారు నెత్తికొని యింటికిం బోయినది.

ఆపట్టణపురాజు మొదటిజామునఁ జల్లగాలి సేవింపదైవికముగా