మాతంగుని కథ.
119
డిగి మంచి రచ్చ రేకులఁదెచ్చి యిచ్చెదఁ దొందరపడకుమని బుజ్జగించెను.
నిత్యము భార్య వేపుచుండ మాతంగుఁడొకనాఁడు గంగాస్నానముచేసి నామములుదిద్ది నిత్యపూజ చేసికొని రక్ష రేకు నిమిత్తమై త్రివేణికిఁ బోవుచుండ దారిలో నొకమాలదాసరి యెదురుపడి మాతంగా యెందుఁబోవుచున్నావని యడిగెను.
మాతం - దాసరీ! నీవు దేశములు తిరుగుచుందువు? పెక్కండ్ర నెఱింగియుందువు? నాభార్యకు గాలిసోకినదఁట రచ్చ రేకు నిమిత్తమై యరుగుచుంటిని. అట్టి వారెందుండిరో చెప్పఁగలవా ?
దాసరి - రచ్చ రేకా? నేనేకట్టఁగలను ఎక్కడికో పోవనేల?
మాతం – నీమాట యటుండనిమ్ము. త్రివేణిలో జపము చేసికొనుచున్న బైరాగుల నడిగిన నీయరా ?
దాసరి -- కాదు. కాదు. అట్లైన నేనొక్కటి సెప్పెదవినుము. ఈపయాగలోఁ బల్లపువీధిని చింతామణియను బోగమామెగలదు. ఆమె ఇరక్తి జెంది నగలు గుడ్డలు ఆవులు ఎడ్లు గుఱ్ఱములు అడిగినవారి కెల్ల బంచిపెట్టి జేగురుగుడ్డగట్టికొని బూడిద బూసుకొని తిరుగుచున్నది. ఆమె మా తెలిసినదంట అక్కడికిఁ బొమ్ము. నీకీబూతియియ్యఁగలదు. అని యుపదేశించిన సంతసించుచు మాతంగుఁడు గురుతులు తెలిసికొని తిన్నగాఁ జింతామణి యింటిముంగలకుఁబోయి వీథి నిలువంబడి జింతామణిగారో యని పెద్దకేక పెట్టెను.
ఆ కేకవిని చింతామణి వాకిటకువచ్చి వానింజూచి నీవెవఁడవు? నన్నేమిటికిఁ బిలిచితివని యడిగెను. దాని యోగినీవేషముజూచి మాతంగుఁడు దండములుపెట్టి తల్లీ ! నేను నీదాసుండ మాతంగుఁడను వాఁడ నాకుఁ బిల్లలులేరు. నాభార్యకు గాలిసోకి యడ్డుపెట్టుచున్నదఁట. రచ్చ రేకుకొఱకై వచ్చితిని నీవు గొప్పదానవంట నాకీయుపకా