పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

శంకరా ! నీకుస్వాగతమా విరించీ ! నీవీ యెడమప్రక్కను గూర్చుండుము కుమారస్వామి ! కుశలమా ఇంద్రా! సుఖముగానుంటివా ? కుబేరా ! కనిపించుటలేదేమి ? అని శ్రీకృష్ణుండు నిద్రలోఁ బలుకుచుండుఁ బలవరింతలను కొని యశోద ధు. ధు. అని బలికినది.

శ్లో. కాళిందీ పులినోదరేషు ముసలీ యావ ద్గతఃఖేలితుం
    తాన త్కార్పరికం పయః పిబ హరెనర్ధిష్యతే తేశిఖా।
    ఇద్దంబాలతయా ప్రతారణపరాః శ్రుత్వా యశోదాగిరః
    పాయాన్నస్వశిఖాం స్పృశన్ ప్రమదితః క్షీ రేర్ధపీతెహరిః.

వత్సా! మనబలరాముఁడు ఆడుటకై కాళిందీతటమున కెంతలో బోవునో ఆలోపల నీవీగిన్నెలోని పాలన్నియుఁ ద్రాగితివేని నీజుట్టు రెండుబార లెదుగునని తల్లిపలుకగా గిన్నిలో పాలు సగముత్రాగి జుట్టెదిగినదేమోఅని చూచుకొను శ్రీకృష్ణుఁడు నన్నురక్షించుగాక.

శ్లో. పీఠె | పీఠనిషణ్ణబాలకగళె తిష్టన్ సగోపాలకః
    యత్రాంతస్థితదుగ్ధ భాండ మవకృష్యాఛాద్యసుంటారవం।
    వక్త్రోపాంతకృతాంజలిః కృతశిరః కంపంపిబన్యఃపయః
    పాయాదాగతగోపికానయన యోగన్ండూషపూతాలంకృత్.

ఒకపీటపై మఱియొక ముక్కాలుపీటవైచి యందొక బాలకుని నిలువఁబెట్టి వానిమెడమీఁద నిలువంబడి యుట్టికిఁగట్టిన గంటమ్రోగ కుండ నానిపట్టి దుగ్ధభాండమువంచి తలద్రిప్పుచుఁ బాలుగ్రోలుచుండ నింతలో గోపికవచ్చి యదలింపబోవుటయు దానిగన్నులు గనంబడకుండ నోఁటిలోనిపాలు దానికన్నులలోఁ గండూషముజేసి పారిపోయినబాలుఁడు నన్ను రక్షించుఁగాక..

శ్లో. రామోనామ బభూవ హుం తదబలా సీతెతి హుం తౌ పితు
    ర్వాచా పంచవటీ తటె విచరత స్తస్యాహరద్రావణః ।
    నిద్రార్ధం జననీ కథా మితిహరే హున్ంకారతశ్శుృణ్వతః
    సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధను రితివ్య గ్రాగిరః పాతుసః॥