పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

    సిల్ల న్మైమలినంబు చూపితివి సీ. సీ. తుచ్ఛభోగమ్ము లే
    నొల్లన్ నీదయసంఘటిల్లెను సుబోధోత్సాహవై రాగ్యముల్.

సీ. అతివరో ! మోహతోయధి మునింగెడునన్ను
                 తెప్పవై తెప్పునఁ దేల్చినావు
    కాంతరో ! నిరయ లోకద్వారమును జేరు
                 నను మరల్చితి స్వర్భువనము దెసకుఁ
    గామాంధకార భీకరమగు నామది
                 వెలిగించితివి జ్ఞాన వితతదీప్తి
    గ్రుడ్డినై చెడుత్రోవ గూడిపోఁ గనులిచ్చి
                లేపిచక్కని త్రోవఁజూపినావు.

గీ. అహహ? నీవంటియాప్తుఁ డెందైనఁగలఁ డె
    తల్లివై నను గురువైన దైవమైన
    నీవె నాకిఁక నేఁటితో నీకునాకు
    వదలెఁగాముక సంబంధవిధివఘాట !

క. నిను జ్ఞానవంతురాలని
   వినుతించెడు జనులమాట విననైతిఁ దమిన్
   గనుగొంటి నేఁడునీమే
   ధను జూపుము నాకునొక్కదారిఁ గృపాక్మన్ .

అని ప్రార్ధించిన విని చింతామణి యత్యంత సంతోషభూషిత స్వాంతయై యోహో ? మత్సంకల్పాను గుణ్యముగానేఁడు వీనికి విరక్తిగలిగినది. యుపదేశించుటకిదియ సమయమని తలంచి.

అ. కలఁడునాకు గురువు గంగాతటంబున
    జపము జేసికొనెడు సంతతంబు
    ఆతనికడకుఁబోయి యడుగుము ముక్తికిఁ
    దెరువెఱుంగఁ జెప్పుఁ దెల్లముగను.