చింతామణి కథ.
95
విహారకీరార్ధ ప్రబోధకంబునునై యొప్పుటంజేసి తదాశయంబున కన్య ధాత్వంబు సంఘటిల్లినది.
కృష్ణమిశ్రుఁడు చిరకాల జనితుండగు నాకుమారు నపారప్రీతి పూర్వకముగాఁ బెనుచుచు మహావిద్వాంసునిజేయు తలంపుతో యుక్త కాలంబున వానిఁజదువ నేసి యొజ్జలనింటికి రప్పించి విద్యజెప్పించు చుండెను. ఆబాలున కాటలయందుఁగల యాసక్తి చదువునందుఁ గుదిరినదికాదు.
లీలాశుకుండు మిక్కిలి చక్కనివాఁడు బ్రహ్మతేజము వాని మొగమునందొలుకుచుండును. ఎట్లైన వానికి విద్యాగంధమంటింప నుత్సహించి తండ్రి వాఁడాడుకొనుచుండఁ బుస్తకంబులఁగైకొని వెను వెంట దిరుగుచు గురువులచే విద్యగఱపించుచుండెను. యముఁడు కృతా కృతంబుల విచారింపఁడుగదా! ఆబాలునకుఁ బండ్రెండేఁడులు నిండక మున్నె కృష్ణమిశ్రు నాత్మీయనగరాశ్రయుం గావించుకొనియెను.
తండ్రి కాలధర్మంబు నొందినపిదప లీలాశుకు నదలించువారు లేమిం జేసి యప్పటికి చదివిన చదువెంతయో యంతటితోనే సమాప్తమైనది. అతండు శృంగారలీలల నెఱుంగుటకై కావ్య నాటకాలంకార గ్రంథముల విమర్శింపుచుండును. మఱియు
సీ. సొగటాలపాళి హెచ్చుగనాడునే ప్రొద్దు
చదరంగమాడ రచ్చలకుఁబోవు
పెండేసి పెద్దయె పెనఁగెడుఁ జెడుగుడి
కోడిపందెముల నెక్కుడు ప్రచారి
బంతులాటకు మేలుబంతియై తగుఁబన్ని
దములఁ గాకితము లెత్తడుములాడు
గోతికొమ్మచ్చులఁ గొమ్మదాసరి మొన
గాఁడు జూదరులకు వాఁడనంగఁ