పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

లేదా? అని నొడివిన నప్పడఁతి యక్కథమేమెఱుఁగ మెట్టిదో చెప్పుఁడని కోరిన నతండిట్లుచెప్పెను.

అని యెఱింగించి

147 వ మజిలీ.

చింతామణికథ.

గీ. కలదు చింతామణీ నామకలిత లలిత
    రూపయౌవన శీల విద్యాపరీత
    యనవగతపాప గణికాన్వయ ప్రదీప
    యపహసితభోగ సువిరాగ యాప్రయాగ.

గీ. చదివినది చాలశృంగార శతకములను
    తెలిసినది కామతంత్ర ప్రదీపికలను
    అరసినది సత్కళారహస్యములఁ బెక్కు
    కాంత పరువమొకింతమై గ్రమ్మినపుడ.

వైశికప్రయోగ ప్రకారమంతయుం బఠించినదైనను చింతామణి పూర్వజన్మవాసనా విశేషంబునం జేసి దుష్ట విటజాలంబులఁ దజ్జాలంబునఁ దృప్తిఁబొంది యౌవనోదయంబున నేకచారిణీవ్రతంబనుష్ఠిం పందలంచి యనుకూల ప్రియాన్వేషణ తత్ఫరయై యున్నంత.

గీ. సకలవేదపురాణశాస్త్ర ప్రవీణ
    ధీవినిజిన్‌తగురుఁడు వర్ధితయశుండు
    శ్రోత్రియుఁడు కృష్ణమిశ్రుఁడన్ సోమయాజి
    కాపురముసేయు నాప్రయాగమున మున్ను.

ఆపాఱునకు నడివయసున నొక కుమారుండుదయించె మారసదృశుండగు వాని యాకారలక్షణంబు లుపలక్షించి సంతసించుచు నతండు శ్రీశుకుండు విలాసార్ధమై జన్మించెనను నర్ధంబు సూచింప నాశిశువునకు లీలాశుకుండను నామకరణము గావించెను. అయ్యభిఖ్య