40
కాశీమజిలీకథలు - మూడవభాగము
వాండ్రందఱు పంచుకొను సమయములో మాగుర్రము రౌతుమాట విమర్శింపలేకపోయిరి. ఆ పెట్టె లన్నియు విడగొట్టి ధనము గోనెలలో నెక్కించుకొని వాండ్రందరు నాగుర్రములెక్కి యెచ్చటికో పోయిరి. అప్పటికి గొంచెము వెల్తురు వచ్చుచున్నది. కావున రంధ్రములవెంబడినేనది అంతయును జూచుచునే యుంటిని. నాగుర్ర మా ప్రాంతమందే యున్నది. కాని వాండ్రకు మాత్రము గనబడలేదు. వాడ్రందరు వెళ్ళినవెనుక నేను ఆ గుర్రపు రౌతు వచ్చునేమో యను వెఱపుతో జాము ప్రొద్దెక్కువఱకు గదలక అట్లే యుంటిని. ఆ గుర్ర మాయడవిలో మేయుచు అటునిటు దిరుఁగజొచ్చినది. కావున బైనఁబరువు లేనందున నొకచోట గంపకు గంప తగులుకొని యాచిక్కము జారి నేలంబడినది.
అప్పుడు నేను మెల్లగా మూత నెగద్రోసికొని యాగంపలోనుండి పైకి వచ్చితిని. అప్పుడు నాకు దిరిగి తల్లి గర్భమునుండి వెల్వడినట్లు తోచినది.
అప్పుడు నేను వెఱ వడఁచికొనుచు, నిర్జనమును, గ్రూరమృగ భూయిష్టము నయి యొప్పు అమ్మహారణ్యములో దారి అరయలేక యిటునటుఁ దిరుగుచుండఁగా నొకచోట నాగుర్రపురౌతు చచ్చిపడి యుండెను.
వాని విమర్శించి చూచునంత సర్పదష్టుండైనట్లు తోచినది. అప్పుడు నేను తలయూచుచు నాహా! దైవవియోగ మీపాటిది కదా?
శ్లో॥ సుఖంవా యదివాదుః ప్రియంవా యసి వా ప్రియం
ప్రాప్తా ప్రాప్త ముపాసీత హృదయేనా పరాజితః।
శోకస్థాన సహస్రాణి భయస్థాస శతానిచ
దివసె దివనెమూఢ మానిశంతి నవందితః॥
సుఖమైనను, దుఃఖమైనను, బ్రియమైనను అప్రియమైనను తటస్థించినప్పుడు బుద్దిని బ్రమాదము నొందనీయక తజ్ఞత్యములైన శోకసంతోషముల నొందగూడదు.నిత్యము మూర్ఖుడు యేమిటికో చింతించుచునే యుండును. ప్రాజ్ఞుడట్టి భయము నొందడు సుఖము దుఃఖాంత మనియు బెద్దలు జెప్పియున్నారు. కావున నేనిప్పుడు విచారించినంబ్రయోజనములేదు. దైర్యముతో నీ అడవియంతయుం దిరిగెదనని తలంచుచు నా ప్రాంతమందు గ్రుమ్మరుచున్నంత విడగొట్టిన పెట్టెలు గనంబడినవి.
అచ్చటికిఁ బోయిచూడఁ బెక్కు మందసములు విలువగల పుట్టములు నా పెట్టెలలో జిక్కియున్నవి. వానింజూచి నేను మిక్కిలి యాశ్చర్యమందుచు విమర్శించినంత భక్ష్యములున్న గంపయొకటి కనంబడినది. నాకు మిక్కిలి యాకలిగా నుండుటచే సంతోషముతో వాని దిని యాకలి అడంచుకొంటిని. అమ్మహారణ్యములో అట్టియుపకారము కావించిన భగవంతున కనేకవందనములు జేయుచు నాకరుణాత్మునిపై భారమువైచి యెద్దియో యొక సన్ననిమార్గము గాన్పించుటయు దానింబడి కొంతదూరము పోయితిని.
మరియు నాయరణ్యమునఁ గ్రూరమృగముల ఘోషములు వెఱపుగొలుప