పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

280

కాశీమజిలీకథలు - మూడవభాగము

పురుషుడు - మంచిపని చేసితివి శబాసు. తరువాత?

స్త్రీ - దైవము వాళ్ళయందే యుండెను. వడ్డించే యాపోశనము పట్టుడని చెప్పితిని. అంతలో నెక్కడినుండి వచ్చెనో మాయకుక్క మూడు గుమ్మములు దాటి వచ్చి వారివిస్తళ్ళు ముట్టుకొని పోయినది. అదిచూచి నామగడతి ఛాందసుడు గనుక నేను వచ్చినది కాని ముట్టలేదని చెప్పినను వినక యావిస్తళ్ళెత్తించి పారవేయించి మరల వడ్డించి పెట్టించెను. తెచ్చిన విషమయిపోయినందున దిరుగా పెట్టుటకు వీలు లేకపోయినది. లేకుంటే బాబు లీపాటికి స్వర్గములో నుందురు.

పురుషుడు - అయితే దీరిపోవును. కానిమ్ము వారిగుఱించి రేపాలోచింతము కాని యిప్పుడు ప్రొద్దుపోయినది. మాటలతోడనే కాలదహణమగుచున్నది. ఏ యంతరాయమువచ్చునో?

స్త్రీ - ఆవల నెవ్వరో యున్నట్లున్నది చూడుము.

పురుషుడు - (చూచివచ్చి) అయ్యో? ఆ ముండాకొడుకులే యిక్కడ బరుండి యున్నట్లున్నది. వాండ్రుగాక యీ పెంటలో శయనించే వారెవ్వరు?

స్త్రీ - బాబో ! మస మాటలు వినుచుండలేదుగదా? మేల్కొని యున్నారేమో చూచితివా?

పురుషుడు — తెలియదు. కదలుచునే యున్నారు. వినినను ఆ యున్మత్తులేమి చేయగలరు?

స్త్రీ - ఆలాగున ననగూడదు.చూచిరా. అని పలుకునంతలో నా మాటలన్నియు వారిరువురు వినుచుండిరి కావున దేవశర్మ అంతా మహావిచిత్రము అంతా మహావిచిత్ర మనియు దైవాయత్తము దైవాయత్తమనియు మూడేసిమార్లు పఠించి యూరకొనిరి. అదివిని యమ్ముదితయు నప్పురుషుండును తోకత్రెంపిన పెట్టవలె మాఱుమాటాడక జడుపుతో చెరియొకదారిం బారిపోయిరి.

అదిమొదలు దేవశర్మ అంతా విచిత్రమని పఠింపదొడగెను. మఱియు నా ఊరిలో స్వైరుణులు కొందరికి వారియునికి బరువై యా విషయ మొకనాడు నీలాటిరేవులో నాడుకొనగా విని యాపురుషులిరువురు నొకనా డెవ్వరికి దెలియకుండ నర్ధరాత్రంబున బయలువెడలి యొక యరణ్యమార్గంబున బోయిపోయి నాలుగు దినములకు సానుమంతమను నగరంబు చేరిరి.

అని యెఱిగించువరకు గాలము మిగులుటయు నప్పటికాకథ చెప్పుట చాలించి మణిసిద్దుడు తరువాత ప్రదేశమున దదనంతర వృత్తాంత మిట్లని చెప్పదొడంగెను.

ఇరువది తొమ్మిదవ మజిలీ

గోపా! వినుమా సానుమంత నగరంబునందు గొన్నిదినంబుల క్రిందట నెవ్వరి కెవ్వరును లేరు నెవ్వరి కెవ్వరును లేరని పలుకుచు నున్మత్తుడొకండు