పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు శకము పదునొకొండవ శతాబ్ది నాటికి ఈ గ్రామము ఒక ప్రసిద్ధ జైన యాత్రా స్థలముగాను, ఎల్లోరా, పటన్ చెరువు, కొబ్బాల్ మొదలైన జైన మహా పుణ్య క్షేత్రములలో సమాన స్థాయిలో నుండినటుల గోచరించు చున్నది. కొంత కాలము క్రితమె ఒక శ్వేతాంబర జైన దేవాలయము పునరుద్దరింపబడి పూజలు మెమలు పెట్టబడెను.

సోమేశ్వర స్వామి వారి ఆలయమునకు పశ్చిమముగా ఉన్న ఊబదిబ్బ మీదనున్న ఒక శిలా స్థంభము మీద ఒక శాసనము కలదు అది బహుశః మానస్థంభ గాని, కీర్తి స్థంభముగాని అయి యుండవచ్చును. ఇది పశ్చిమ చాళుక్య వంశజుడైన త్రిభువన మల్ల ఆరవ విక్రమాదిత్యుని నాటిది. అతని పుత్రుడగు కుమార సోమేశ్వరుని వరముగా చెక్కబడియున్నది. ఈ స్థంభమునకు నాలుగు ప్రక్కల శాసనములు గలవు. ఇందు సోమేశ్వరుడు పానుపుర గ్రామమును, కొలను పాకయందు కల "అంబిక యను జైన దేవతకు కానుకగా ఇచ్చినటుల ఇందు తెలుప బడెను. అటులనే ప్రెగ్గడ కేశి రాజు అను చాళుక్య ప్రభువు యొక్క దేవాదాయ, ధర్మాదాయ శాఖాదికారి అంబిక దేవాలయములో ఈ జయ స్థంభమును, తన చక్రవర్తి త్రిభువన మల్లుని పేర చెక్కించి పెట్టియుండునోపు. ప్రెగ్గడ కేశిరాజు జైన భక్తుడు.

షడక్షురినిచే వ్రాయబడిన రాజ శేఖర విలాసమునందు కొల్లిపాక శైవ మతాచార్యుడైన రేణుకాచార్యుని యొక్క జన్మస్థలముగా పోర్కొనబడినది. ఈ గ్రంధము ననుసరించి రేణు కాచర్యులు జైన మత ప్రవక్తలలో ముఖ్యుడనియు, అయోనిజుడనియు, ఇచ్చట స్వయంభులింగమైన సోమేశ్వరుని నుంచి ఉద్భవించి, చివరకు మరల అదే లింగములోన సిద్ధిపొందిరట. వీరు చాలకాలము వీర శవ మత ఉద్దరణకై పాటు పడిరి. పడక్షురుల వారు చెప్పుటలో, తేను కేశుడను శైవాచార్యునకు రుద్రమునీశ్వరుడను కుమారుడు కలిగెనని, తేను కేశులవారు, తమ యనంతరము రుద్రమునీశ్వరుకి లింగాయతే మతమున కధిపతిని చేసెనని వ్రాసినారు. తేను కేశుడి లింగాయక మత మందలి అయిదుమంది ముఖ్యగురువులలో ఒకరు. ఆయన కొలను పాకలో ఒక లింగాయత మతమును స్థాపించి దానికి తన కుమారుని మతాధిపతిగా నియమించెనట. ఇదంతా చెప్పి షడక్షురులవారు తాను గూడా ఈ లింగాయత మతాధిపతుల వంశములోని చిక్కవీర దేవునికి బంధువనని తెలుపుకొన్నాడు. ఈ చిక్కవీర దేవుడు రుద్రమునీశ్వర వంశ వృక్షములోని ఉద్దీన, గండలీశ్వర, అన్నడ నీశ, రేవణ సిద్ధి మొదలుగా గల వారి ననువర్తినని తెలుచున్నాడు.

వీరశైవాగగము ననుసరించి రేణుకాచార్యుడు మరెవరో కాదు, రేవణ సిద్దయ యనియూ, ఇతనే అగస్త్య మహామునికి సిద్ధాంత శిఖామణి యందు పొందు పరచిన స్థతస్థల సిద్ధాంతమును గూర్చి తెలియవరచెనని కూడ ప్రతీతి కలదు. ఇందు