అయిదు రూపాయలు జుల్మానా వేశారట. యీ కథ శుద్దాబద్దం అనీ, తనచేత శ్లోకాలు చదివించి దొరగారు అయిదు రూపాయలు ప్రెజంటిచ్చారని, అవి పెట్టి కొత్త వ్యాయవార పాత్ర కొన్నాననీ మనవాళ్ళయ్య చెబుతాడు.
2
శైవులలో వున్న ఐకమత్యం వైష్ణవుల్లో లేదు. సాతాన్లు చాలమంది మనవాళ్ళయ్య శిష్యులే. అయినప్పటికీ కొందరుమట్టుకు అతను అవతార పురుషుడని చెప్పరు. అతనంటాడు - శరభయ్యే వృషభావతారమైనప్పుడు నేను గరుడాళ్వారి పూర్ణావతారం కాకపోతే కాకపోవచ్చును గాని వారి యొక్క అత్యల్పాంశవల్లనైనా జన్మించి వుండకూడదా. గరుడాళ్వారి నఖముల యొక్క తేజస్సు నాయందు ఆవిర్భవించి వున్నది కాబట్టే, శరభయ్యను యిలా చీల్చి పేల్చుతున్నాను.
అయ్యవార్లంగారికి ఒక మాటు యీ మాట చెవి సోకి గట్టి చీవాట్లు పెట్టారు. ఆ చీవాట్లు తిని పైకి వచ్చి, “యీ బ్రాహ్మలదీ, జ్ఞానము కాదు. అజ్ఞానమూ కాదు. కడజాతి మనుష్యులే భక్తి ప్రభావం చేత అళ్వార్లు అయివుండిరి గదా! ఇంతకాలవాఁయి రాముడి ధ్వజమును జయప్రదంగా మోస్తూ, శైవ సంహారం చేసిన నేను శ్రీమద్గురుడాళ్వారి నఖాగ్రాగ్రం యొక్క అవతారం యేల కాను? గరుడాళ్వారి నఖములు పెరిగి, ఖండన ఐనప్పుడూ ఆ ముక్కలు నా వంటి భక్తులుగా ఆవిర్భవించి పరమత సంహారం చేస్తవి గాని, వృధాగా పోనేర్చునా? వట్టి మాట!” అన్నాడు. “ఔర : యేమి మూర్ఖత; యేమి అహంభావము. యీ అజ్ఞులా అవతార పురుషులు? యిలా అన్నందుకు వీళ్ల తలలు పగిలిపోవురా?” అని గురువుగారు అన్నారు.
“శాస్తుర్లు గారూ! పాతరోజులైతే వీళ్ళే అవతారాలయి పోదురు. వీళ్ళ పేరట బొమ్మలు నిలిపి, దేవాలయాలు కట్టి, మనవేఁ పూజ్జేతుం. మరి బుద్ధుడూ యిలాంటి మనిషే గదండి” అన్నాడు వెంకయ్య.
“చాకి బట్టెకీ సముద్రానికీ సాపత్యం తెస్తివి” అన్నారు గురువు గారు.
“అన్న మాటకల్లా వ్యాఖ్యానం చేస్తే గాని వూసుపోదురా?” అని నే అన్నాను.
“యీ వూరి నాయలు స్తోమం కలవాళ్లు. అందులో సారధి నాయడు లక్షాధికారి. అతని బావమరిది రామినాయడు గ్రామ మునసబు. కొంచధూర్తూ, నిషా బాజీన్నీ - భోజన ప్రియుడు. యీ తాలూకాలో కల్లా పెద్ద సారా దుకాణం యీ వూళ్ళోనే వుంది. దాన్ని బట్టి ఈ వూరి యోగ్యత మీరు వూహించుకోవచ్చును.
నాలుగు సంవత్సరముల కిందట యిక్కడికి దక్షిణ దేశం నుంచి ఒక అయ్యవార్లంగారు
గురుజాడలు
534
మీ పేరిమిటి?